Thursday, January 24, 2013

ప్రపంచ తెలుగు మహాసభలు

ప్రపంచ తెలుగు మహాసభలు

ప్రపంచ తెలుగు మహాసభలు [1]మొదటిసారిగా హైదరాబాదులో 1975 నిర్వహించారు. ఆ సందర్భంగా ఎందరో తెలుగు ప్రముఖుల్ని సన్మానించారు. కొన్ని ముఖ్యమైన పుస్తకాల్ని ప్రచురించారు. ఆనాటి సభల జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం ఒక తపాలా బిళ్ళను విడుదలచేసింది.

మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు (1975)

ప్రధాన వ్యాసం: మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు

రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు (1981)

ప్రధాన వ్యాసం: రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు

మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు (1990)

మారిషస్ లోమూడవ ప్రపంచ తెలుగు మహాసభలు డిసెంబర్ 8వ తేదీ నుండి మూడు రోజుల పాటు వైభవంగా జరిగాయి. మారిషస్ ప్రభుత్వ సహకారంతో అక్కడి తెలుగు కల్చరల్ ట్రస్టు మరియు తెలుగు విశ్వవిద్యాలయం కలిసి, ఇందిరా గాంధీ సాంస్కృతిక కేంద్రంలో వీటిని నిర్వహించారు.[2]

నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (2012)

ప్రధాన వ్యాసం: నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు
నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల చిహ్నం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 25కోట్ల ఖర్చుతో నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు [3] డిసెంబరు 27,28 మరియు 29, 2012లో తిరుపతిలో జరప నిశ్చయించింది. అయితే తెలుగు భాషోద్యమ సమాఖ్య మరియు సాహిత్యసంఘాలు తెలుగు అభివృద్ధికి చేసిన కోరికలను అంగీకరించనందున నిరసనతెలుపుతూ తెలుగు మహాసభలను బహిష్కరించ నిర్ణయించాయి [4]

చిహ్నం

ప్రపంచ తెలుగు మహాసభల చిహ్నం తెలుగుజాతిని వివిధ కొణాలలో ఆవిష్కరిస్తున్నది. ఇందులోని రెండు సర్పాలు తెలుగువారి విజ్నానానికి సంకేతాలు. నౌక శాతవాహన కాలంలోనే ఆంధ్రుల నౌకా నైపుణ్యానికి చిహ్నం. పూర్ణకుంభం బౌద్ధయుగంలోను మరియు ఓరుగల్లు ద్వారం కాకతీయయుగంలోను తెలుగువారి ప్రాభవాన్ని తెలియజేస్తుంది. దీనిలోని హంస క్షీరనీర న్యాయానికి, భారతీయుల ఆత్మతత్త్వానికి ప్రతీక. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం, రాజధాని హైదరాబాదు నగరం భారతదేశపు రేఖాచిత్రంలో నిక్షిప్తమై తెలుగుజాతి మనుగడను స్పష్టం చేస్తున్నాయి. భారతదేశపు త్రిభాషా సూత్రం తెలుగు, హిందీ, ఇంగ్లీషు లిపులలో అక్షరరూపం దాల్చింది.

తెలుగు మహాసభలు
తెలుగు మహాసభలు యధాతథం, వేదిక మార్పు
హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలను యధాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుపతిలో భారీ వర్షాలు పడడంతో సభలు వాయిదా వడే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ప్రపంచ తెలుగు మహాసభలపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి గురువారం సచావాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న విధంగా మహాసభలు జరగాలని, అవసరమైతే వేదికను మార్చాలని ...

Friday, January 18, 2013

లేపాక్షి

లేపాక్షి

లేపాక్షి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక చారిత్రక పట్టణము మరియు అదే జిల్లాకు చెందిన ఒక మండలము. బెంగుళూరు నుండి 120 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాదు, బెంగుళూరు రోడ్డుకు ఎడమ వైపు నుండి 16 కి.మీ. దూరంలో ఉంటుంది. పట్టణ ప్రవేశంలో ఉన్న ఒక తోటలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఇక్కడికి 200 మీ. దూరంలో మధ్య యుగం నాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది. ఇక్కడకూడా దాదాపు ముప్పై అడుగుల ఎత్తువరకొ కల పాము చుట్టుకొని ఉన్నట్లున్న శివలింగం ఆరుబయట ఉంటుంది. చక్కటి శిల్పచాతుర్యంతో కూడిన స్థంభాలు, మండపాలు మరియు అనేక శివలింగాలతో కూడిన ఈ గుడిలో ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. ఈ దేవాలయము పెద్ద ఆవరణ కలిగి మద్యస్థంగా గుడితో సుందరముగా ఉంటుంది.
ఇక్కడి గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడి మూలవిరాట్టు వీరభధ్ర స్వామి. గుడి లోపల ఒక స్తంభానికి దుర్గా దేవి విగ్రహము ఉన్నది. మాములుగా దేవుడు మనకు గుడి బయటినుండే కనపడుతారు . వీరభధ్ర స్వామి ఉగ్రుడు కాబట్టి, అతని ఛూపులు నేరుగా ఊరి మీద పదకూడదు అని గుడి ద్వారం కొంచం ప్రక్కకు వుంటుంది. గుడి లోని పైకప్పు మీద కలంకారి చిత్రాలు అద్భుతంగా వేయబడ్డాయి. ఈ గుడికి ముఖ్య ఆకర్షణ వేలాడే స్తంభం. ఈ స్తంభం కింద నుంచి మనము ఒక తువ్వాలుని అతి సులువుగా తీయవచ్చును. ఇది అప్పటి విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క కళాచాతుర్యానికి ఒక మచ్చుతునక.

భారతదేశంలో అతిపెద్ద నంది శిల్పం.. లేపాక్షి ( వీడియో)
మంగళవారం, 27 డిసెంబర్ 2011( 13:40 IST )
"సీతమ్మతల్లిని రావణుడు చెరబట్టి తీసుకెళ్తుంటే, ఆమెను కాపాడబోయి గాయపడ్డ జటాయువును చూసిన శ్రీరామచంద్రుడు లే పక్షీ అని పిలిస్తే, జటాయువు లేచి నిలుచుందని, అందుకే ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు."

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాకు చెందిన ఒక చారిత్రక పట్టణమే లేపాక్షి. ఇది బెంగళూరుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే హైదరాబాదు, బెంగళూరు రోడ్డుకు ఎడమవైపు నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ లేపాక్షి ఊరిలోకి ప్రవేశించగానే... అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో మనకు ఆహ్వానం పలుకుతుంది.

పురాతత్వశాఖవారి లెక్కల ప్రకారం ఈ లేపాక్షి బసవన్న 8.1 మీటర్ల పొడవు, నాలుగన్నర మీటర్ల ఎత్తుతో మహా లింగానికి ఎదురుగా కూర్చుని ఉంటుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద నంది శిల్పంగా పేరుగాంచింది. తంజావూరు బృహదీశ్వరాలయం, మైసూరులోని చాముండి హిల్, బెంగళూరులోని బసవన్న గుళ్లలో ఉండే నంది విగ్రహాలకంటే, లేపాక్షి విగ్రహమే పెద్దది.

లేపాక్షి అందాలు... హిందూపురం చరిత్ర!

లేపాక్షి...మా హిందూపురానికి 13 కి.మీ. దూరంలో ఉండే చారిత్రాత్మక ప్రదేశం. విజయనగర రాజుల పరిపాలనలో పరిఢవిల్లిన కళాతేజం. నా యాహూ 360 మిత్రుడు 'మహేష్' అందించిన అద్భుత చిత్రాలివి. మీరూ ఇక్కడికి వెళ్లి లేపాక్షి కళాసంపదను వీక్షించండి. వీలైతే అక్కడికి స్వయంగా వెళ్లి మీ కళ్లతో చూసి మీ కళాతృష్ణను తీర్చుకోండి.

అప్పట్లో ఈ ప్రాంతంలో పెనుకొండ, లేపాక్షి పెద్ద జనావాసాలు. హిందూపురం అంతా నిన్న మొన్నటిది. ఈ ప్రాంతం రాయల తర్వాత నవాబుల చేతిలో కొన్నాళ్లు, పాలెగాళ్ల చేతిలో కొన్నాళ్లు, అ తర్వాత విజృంభించిన మరాఠాల ఏలుబడిలో కొన్నాళ్లు ఉన్నప్పుడు మురారిరావనే ఓ మరాఠా నాయకుడు వాళ్ల నాన్నగారైన హిందూరావు పేరు మీదుగా హిందూపురాన్ని నిర్మించాడు. తర్వాత టిప్పు సుల్తాన్ వశమై, బ్రిటిషు వారు టిప్పు సుల్తాన్ ని శ్రీరంగపట్టణంలో చంపి ఈ ప్రాంతాన్నంతా నైజాం పరిపాలన క్రిందికి తెచ్చారు. ఆ తర్వాత నైజాం ఈ ప్రాంతాన్ని బ్రిటిషు వారికి దత్తత ఈయబట్టి దత్తమండలంలో ఓ భాగంగా మారింది.

ఈ విషయాలన్నీ ఎన్నో పుస్తకాల్లో చదివాక హిందూపురంలో ఉన్న ఎందరో మరాఠీ మిత్రులు, మా తాత ఇంటిలోనే కాక మా ప్రాంతంలో చాలా మంది ఇళ్లల్లో ఉండే టిప్పుసుల్తాన్ చిత్రపటాలకు అర్థం తెలిసొచ్చింది. ఇక ఇప్పటి రాజకీయాలకొస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడైన "ఎన్టీయార్" ను శాసనసభకు పంపించిన నియోజకవర్గం మాది. అన్నగారిని 84 లో అన్యాయంగా పదవి నుంచి దించినప్పుడు జరిగిన ప్రజాందోళనలో మరణించిన అభిమానుల త్యాగానికి నేను (నాలుగవ తరగతి చదువుతున్న సమయం) ప్రత్యక్షసాక్షిని. కానీ రెండోసారి అదే అన్యాయం జరిగితే...? ప్రధాన మంత్రి కాబోయి తృటిలో తప్పిన దురదృష్టం అన్నగారిది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాకు చెందిన ఒక చారిత్రక పట్టణమే లేపాక్షి. ఇది బెంగళూరుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే హైదరాబాదు, బెంగళూరు రోడ్డుకు ఎడమవైపు నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ లేపాక్షి ఊరిలోకి ప్రవేశించగానే... అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో మనకు ఆహ్వానం పలుకుతుంది.

పురాతత్వశాఖవారి లెక్కల ప్రకారం ఈ లేపాక్షి బసవన్న 8.1 మీటర్ల పొడవు, నాలుగన్నర మీటర్ల ఎత్తుతో మహా లింగానికి ఎదురుగా కూర్చుని ఉంటుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద నంది శిల్పంగా పేరుగాంచింది. తంజావూరు బృహదీశ్వరాలయం, మైసూరులోని చాముండి హిల్, బెంగళూరులోని బసవనగుడిలలో ఉండే నంది విగ్రహాలకంటే, లేపాక్షి విగ్రహమే పెద్దది.

మంచి ఆరోగ్యంతో ఉండే చక్కటి కోడెగిత్త విగ్రహమే లేపాక్షి. గంటలు, లోహపు బిళ్లలతో కూడిన పట్టీలు మొదలైన ఎన్నో అలంకరణలు ఉన్నప్పటికీ, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మాత్రం నంది మెడలో కనిపించే రెండు గరుడ పక్షులు, వాటి ముక్కుల్లో వేలాడే ఏనుగులే. ఇది ఆ పక్షుల శక్తిని, పరిమాణాన్ని సూచిస్తుంది.
ఆ పేరెలా వచ్చిందంటే...?
  సీతమ్మతల్లిని రావణుడు చెరబట్టి తీసుకెళ్తుంటే, ఆమెను కాపాడబోయి గాయపడ్డ జటాయువును చూసిన శ్రీరామచంద్రుడు లే పక్షీ అని పిలిస్తే, జటాయువు లేచి నిలుచుందని, అందుకే ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.      



అలాగే నంది కుడి ఎడమపక్కలలో నృసింహస్వామి ముఖం చెక్కబడి ఉంటుంది. విగ్రహం కుడివైపున నిలబడి నంది దృష్టిలోంచి చూస్తే వీరభద్రాలయంలోని నాగరాజు ఏడు పడగల విగ్రహం కొంత స్పష్టతతో కనిపిస్తుంది. విజయనగర రాజుల కాలంలో నిర్మించబడిన వీరభద్రాలయం గోడలమీద, పైకప్పుమీద అనేక కుడ్య చిత్రాలు మనోహరంగా వ్రాయబడి ఉన్నాయి. ఇక్కడి ముఖ్య విశేషమే లేపాక్షి బసవన్న.

వీరభద్రాలయం కూర్మశిల అనే కొండమీద నిర్మించబడింది. కొండ ఆకారం తాబేలు రూపంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. విజయనగర ప్రభువుల కాలంలో లేపాక్షి పెద్ద వాణిజ్య కేంద్రంగానూ, యాత్రాస్థలంగానూ విలసిల్లింది. అచ్యుతదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని క్రీ.శ. 1530 నుంచి క్రీ.శ. 1542 వరకూ పరిపాలించాడు. ఈయన కాలంలో వీరభద్రాలయ నిర్మాణం జరిగినట్లుగా, ఆలయ గోడల్లోని రాతలు ధృవపరుస్తున్నాయి.

ఇక లేపాక్షికి ఆ పేరెలా వచ్చిందంటే.. సీతమ్మతల్లిని రావణుడు చెరబట్టి తీసుకెళ్తుంటే, ఆమెను కాపాడబోయి గాయపడ్డ జటాయువును చూసిన శ్రీరామచంద్రుడు లే పక్షీ అని పిలిస్తే, జటాయువు లేచి నిలుచుందని, అందుకే ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.

మరో కథ ప్రకారం చూస్తే... అచ్యుతరాయలు కోశాధికారి విరూపణ్ణ రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపట్టాడు. నిర్మాణం చాలా వరకూ పూర్తయి, కళ్యాణ మంటపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి ఈ విషయాన్ని విరూపణ్ణ వ్యతిరేకులు చేరవేసారు.

దీంతో విరూపణ్ణ ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకుని రెండు కళ్లనూ తీసివేసి కళ్యాణ మంటపం దక్షిణవైపున ఉండే గోడకు విసిరి కొట్టాడట. అలా కళ్లు విసిరికొట్టిన ఆనవాళ్ళుగా అక్కడి గోడపైనుండే ఎర్రటి గుర్తులను స్థానికులు చూపుతుంటారు కూడా. అలా లోప- అక్షి (కళ్లు లేని) అనే పదాల ద్వారా ఏర్పడిందే లేపాక్షి అని చెబుతారు.

లేపాక్షికి 200 కిలోమీటర్ల దూరంలో మధ్యయుగాలనాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం నెలకొని ఉంది. ఈ ఆలయంలో దాదాపు ముప్పై అడుగుల ఎత్తు ఉండే శివలింగాన్ని పెద్ద పాము చుట్టుకుని ఉన్నట్లుగా ఉండే శివలింగం ఉంటుంది. ఇంకా ఈ ఆలయంలో చక్కటి శిల్పకళా చాతుర్యంతో కూడిన స్తంభాలు, మండపాలు, అనేక శివలింగాలు ఉంటాయి. ఈ ఆలయంలో ఇప్పటికీ పూజలు నిర్వహిస్తుంటారు కూడా...!

లేపాక్షికి వెళ్ళాలంటే... హిందూపురం నుండి ప్రతిగంటకు బస్సులు వున్నాయి. ఇక వసతి విషయానికి వస్తే, అక్కడో టూరిస్టు గెస్ట్‌హౌస్ కూడా కలదు. ఇదిలా ఉంటే... లేపాక్షి వీరభద్ర ఆలయంలోని శిల్పాలలో ఎక్కువభాగం పాక్షికంగా దెబ్బతిని కనిపిస్తాయి. ఈ విషయంలో పెద్దగా జాగ్రత్తలేవీ తీసుకున్న ఆనవాళ్లు కనిపించవు. ఇకనైనా ఏపీ టూరిజం శాఖవారు మేల్కొని లేపాక్షి శిల్ప, చిత్ర సంపదలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

రామాయణము

రామాయణము

రామాయణము ప్రాముఖ్యము

24,000 శ్లోకములతో కూడిన రామాయణము భారతదేశము, హిందూ ధర్మముల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడినది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శజీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును.
వాల్మీకి రామాయణమే గాక, వేదవ్యాసుని ఆధ్యాత్మ రామాయణము, భవభూతి ఉత్తర రామచరితము పేరెన్నిక గన్నవి. ఇంక రామాయణములోని పాత్రలు, సంఘటనలు, భావములు, తత్వములు అంతర్గతముగా నున్న పురాణములు, కధలు, కావ్యములు, పాటలు అన్ని భారతీయ భాషలలోను లెక్కకు మిక్కిలిగా ఉన్నవి. కాని వాల్మీకి రామాయణమే ప్రధాన ప్రమాణముగా సర్వత్రా అంగీకరింప బడుతున్నది. ఆదికవి వాల్మీకి ప్రార్ధన సంప్రదాయముగా చాలామంది కవులు స్మరిస్తారు.
కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
కావ్యం రామాయణం సీతాయాశ్చచరితమ్ మహత్
పౌలస్త్య వధమిత్యేవ, చకార చరిత వ్రత:
రామాయణము ప్రధానముగా సీతా రాముల పుణ్యచరితము . ఆంజనేయ భక్తి భరితము. వీరిని గూర్చిన ప్రార్ధనలు ఎన్నో ప్రచారములో నున్నవి. మచ్చుకు కొన్ని.
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం.
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
దక్షిణే లక్ష్మణో యస్య వామేచ జనకాత్మజా
పురతో మారుతిర్యస్య తం వందే రఘు నందనమ్
గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసమ్
రామాయణ మహా మాలా రత్నం వందే అనిలాత్మజమ్
రామ నామము సకల పాప హరమనీ, మోక్షప్రదమనీ పలువురి నమ్మిక. "రామ" నామము లో పంచాక్షరీ మంత్రము "ఓం నమ శివాయ" నుండి 'మ' బీజాక్షరము, అష్టాక్షరీ మంత్రము "ఓం నమో నారాయణాయ" నుండి 'రా' బీజాక్షరము పొందుపరచబడియున్నవని ఆధ్యాత్మిక వేత్తల వివరణ. ఒక్కమారు "రామ" నామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము చేసిన ఫలము లభించునని శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడినది.
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తు(స్తు)ల్యమ్ రామనామ వరాననే

వాల్మీకి - రామాయణ కావ్యావతరణము గురించిన కధ

క్రౌంచ పక్షులను నిషాదుడు చంపగా వాల్మీకి నోటి నుండి అప్రయత్నంగా వచ్చిన రామాయణ శ్లోకం
మహర్షి వాల్మీకి ఆదికవియే గాక వేదాంతి. దార్శనికుడు. తపస్వి. ప్రజలకు మార్గ దర్శకుడు. సంస్కర్త. కార్యాచరణ వేత్త. ఆయన తన శిష్యులతో తమసా నదీ తీరమున వెళ్ళుచుండగా ఒక వేటగాడు క్రౌంచ పక్షుల జంటలో మగ పక్షిని బాణముతో కొట్టెను. అప్పుడది విలవిలలాడుచు అసువులు వీడెను. ఆ దృశ్యమును జూచి, వాల్మీకి ముని హృదయము ద్రవించెను. మనస్సు ఆర్ద్రమయ్యెను. శోకాకులుడైన ఆయన నోట ఈ మాటలు వెలువడెను.
మానిషాద ప్రతిష్ఠాం త్వమగమ: శాశ్వతీస్సమా:
యత్ క్రౌంచ మిధునాదేకమ్ అవధీ: కామ మోహితమ్
"ఓరీ కిరాతకుడా! క్రౌంచ దంపతులలో కామమోహితమగు ఒకదానిని చంపి, నీవు శాశ్వతమగు అపకీర్తిని పొందితివి"
శోక పరితప్త హృదయముతో ఆయన ఉచ్ఛరించిన ఈ మాటలు ఛందో బద్ధముగా నున్న మొదటి శ్లోకమని సంస్కృత సాహిత్య చరిత్రలో నమ్మకము. ఆప్పుడు బ్రహ్మదేవుడు వాల్మీకికి ఆ శ్లోక విశిష్టతను తెలిపి, శ్రీ రామ చరిత్రను కావ్య రూపమున రచింపమని ప్రేరేపించెను. లోకములయందు పర్వతములు, నదులు ఉన్నంత కాలము ఆ రామాయణ కావ్యము ప్రకాశించునని దీవించెను.
యావత్ స్థాస్యంతి గిరయ: సరితశ్చ మహీతలే
తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి.

రామాయణ మహాకావ్యమ్ శతకోటి ప్రవిస్తరమ్
ఏకైకమక్షరమ్ ప్రోక్తమ్ పుంసామ్ మహా పాతక నాశనమ్

తెలుగులో

రామాయణమును చాలా మంది కవులు తెలిగించినారు. వారిలో మొల్ల కవయిత్రి (మొల్ల రామాయణము ), కంకంటి పాపరాజు (ఉత్తర రామ చరితము), గోన బుధ్ధా రెడ్డి (రంగనాథ రామాయణము), విశ్వనాధ సత్యనారాయణ (రామాయణ కల్పవృక్షము), వావిలికొలను సుబ్బారావు లేదా వాసుదాస స్వామి (అంధ్ర వాల్మీకి రామాయణము), ఉషశ్రీ ప్రసిధ్ధులు. ఐతే లెక్కకు మిక్కిలి ఇతర అనువాదములు, స్వతంత్ర రచనలు ఉన్నాయి. ఇక రామాయణముతో సంబంధము గల రచనలు, కీర్తనలు, పాటలు, సినిమాలు, కథలు, పేర్లు, వూర్లు - చెప్పనవసరం లేదు. దాదాపు ఆంజనేయ స్వామి గుడి లేని వూరు అరుదు.

తెలుగులో ఎందరో మహానుభావులు 'రామ'నామమును స్మరించి, సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమంతులను, వాల్మీకిని స్తుతించి ప్రసిద్ధులైనారు. వారిలో ప్రధానముగా పోతన,మొల్ల, రామదాసు, త్యాగరాజు, అన్నమయ్య, వాసుదాసస్వామి లను పేర్కొనవచ్చును.

ఈ వ్యాసము చివరలో రామాయణానికి సంబంధించి తెలుగునాట కొన్ని రచనలూ, మందిరాలూ, విషయాలూ ఇవ్వబడివి.

కావ్య విభాగములు, సంక్షిప్త కథ

రామాయణ మహాకావ్యము ఆరు కాండములు (భాగములు)గా విభజింప బడినది. మొత్తము 24వేల శ్లోకములు (శతకోటి అక్షరములని కూడా చెబుతారు). కాండము అనగా చెరకుగడ కణుపు అని అర్ధము. రామాయణ కధనము చెరకు వలె మధురమైనది గనుక ఈ పేరు సమంజసమని పండితులు వివరిస్తారు. ఒక్కొక్క కాండములోను ఉప భాగములు "సర్గ"లు.
  • బాల కాండము (77 సర్గలు): కథా ప్రారంభము, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగపరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కల్యాణము
  • అయోధ్యా కాండము (119 సర్గలు): కైకేయి కోరిక, దశరథుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము
  • అరణ్య కాండముు (75 సర్గలు): వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణము
  • కిష్కింధ కాండము (67 సర్గలు): రాముని దుఃఖము, హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట, వాలి వధ, సీతాన్వేషణ ఆరంభము
  • సుందర కాండము (68 సర్గలు): హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునకు తెలియజెప్పుట
  • యుధ్ధ కాండము (131 సర్గలు): సాగరమునకు వారధి నిర్మించుట, యద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము
  • ఉత్తర కాండము: సీత అడవులకు పంపబడుట, కుశ లవుల వృత్తాంతము, సీత భూమిలో కలసిపోవుట, రామావతార సమాప్తి - (కాని ఇది మూలకావ్యములోనిది కాదని, తరువాత జతచేయబడినదని కొందరి అభిప్రాయము.)


ఇక్కడ ఒక్కొక్క కాండము కథ మాత్రము సంక్షిప్తముగా ఇవ్వబడినది. ఆయా కాండములకు సంబంధించిన ప్రత్యేక వ్యాసాలలో మరింత విస్తారంగా చెప్పబడింది.


బాలకాండము

శివ ధనుర్భంగము - రవివర్మ చిత్రం
ఆయోధ్యా నగరం రాజధానిగా, కోసలదేశాన్ని ఇక్ష్వాకువంశపు రాజైన దశరథుడు పాలిస్తున్నాడు.కౌసల్య, సుమిత్ర, కైకేయి అయన భార్యలు. పిల్లలు లేని కారణంగా దశరధుడు పుత్రకామేష్ఠి యాగం చేశాడు. తరువాత ఆ రాజుకు నలుగురు బిడ్డలు జన్మించారు. వారికి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు.
రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మవద్ద వరాలుపొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నాడు. వానికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్ధనలు మన్నించి శ్రీ మహా విష్ణువు వానిని హతంచేయడానికి నరుడై జన్మింపనెంచాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖ చక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీమహాలక్ష్మి సీతగా అయోనిజయై జనక మహారాజు ఇంట పెరుగుతున్నది. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు కిష్కింధలో ఉన్నాడు.
కులగురువు వశిష్టుని వద్ద రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు సకల విద్యలనూ అభ్యసించారు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి దశరధుని వద్దకు వచ్చి తన యాగసంరక్షణార్ధమై రామ లక్ష్మణులను తనతో పంపమని కోరాడు. ముక్కుపచ్చలారని నవయువకులను పంపడానికి దశరధుడు సంకోచించినా, వశిష్ఠుని సలహామేరకు విశ్వామిత్రునితో పంపాడు. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు ఎన్నో అస్త్రవిద్యారహస్యాలను బోధించాడు. దారిలో రామ లక్ష్మణులు తాటకి అనే రాక్షసిని సంహరించారు. గంగానదిని దర్శించారు. రాముని పాదము సోకి అహల్యకు శాపవిమోచనమైనది.

రామ లక్ష్మణుల రక్షణలో యాగము జయప్రదముగా జరిగినది. మారీచ సుబాహులూ, ఇతర రాక్షసగణములూ దండింపబడ్డారు. తిరుగుదారిలో వారు జనకుని రాజధానియైన మిధిలానగరం చేరారు. అక్కడ సీతా స్వయంవరంలో రాముడు శివుని విల్లు విరచి, సీతకు వరుడైనాడు. సీతారాములు, ఊర్మిళా లక్ష్మణులు, మాండవీ భరతులు, శృతకీర్తీ శతృఘ్నుల వివాహం కనుల పండువుగా జరిగింది. తిరుగుదారిలో రాముని ఎదిరించిన పరశురామనకు తాము ఇద్దరూ విష్ణుస్వరూపులే అని తెలిసినది.
మహా వైభవముగా నలుగురు జంటలూ అయోధ్యకు తిరిగి వచ్చారు. అయోధ్యలో పాలన నిత్యకల్యాణముగా సాగుతున్నది.

అయోధ్యా కాండము

సరయు నది దాటుతున్న రాముడు
దశరధుడు రాజ్యభారాన్ని పెద్దకొడుకైన రామునకప్పగింపవలెనని సంకల్పించాడు. పట్టాభిషేకానికి సర్వమూ సిద్ధమైనది. అంతటా వేడుకలు జరుగుతున్నాయి.
రాముని సవతి తల్లియైన కైకేయికి రాముడంటే ఎంతో వాత్సల్యము. కాని ఆమె చెలికత్తె మంధర కైకేయి కి ఇలా నూరిపోసింది - "రాముడు రాజయితే కౌసల్య రాజమాతవుతుంది. నీ స్థానం బలహీనపడుతుంది. కనుక భరతుని రాజుగా చేసి, రాముని దూరంగా పంపే మార్గం ఆలోచించు.". ఈ మాటలు కైకేయి వంటబట్టాయి. అంతకు పూర్వము దశరధుడు ఆమెకు రెండు కోరికలు ప్రసాదించాడు. వాటిని గుర్తు చేస్తూ ఆమె దశరధుని రెండు కోరికలు కోరింది - (1) భరతుని పట్టాభిషేకము (2) రామునకు 14 ఏండ్ల వనవాసము.
దశరథునకు ఎటూ పాలుపోలేదు. దుఃఖంతో కృంగిపోయాడు. కాని రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి కృతనిశ్చయుడై ఉన్నాడు. రామునితోబాటు ఆత్మయైన సీతా, నీడయైన లక్ష్మణుడూ వనవాసానికి బయలుదేరారు. అయోధ్యాపురవాసులంతా విలపించారు.అందరివద్దా సెలవు తీసుకొని సీతారామలక్ష్మణులు సకలసౌఖ్యాలూ వర్జించి, నారదుస్తులు ధరించి వనవాస దీక్షకు సిద్ధమైనారు. దారిలో గుహుడనే నిషాదరాజు వారిని గంగానది దాటించాడు. అక్కడ దశరధుడు రామునికై విలపిస్తూ స్వర్గస్తుడైనాడు.
మేనమామల ఇంటినుండి అయోధ్యకు వచ్చిన భరతుడు తల్లి చేసిన పనికి మండిపడ్డాడు. ఆమె ముఖం చూడడానికీ, తన ముఖం ఇతరులకు చూపడానికీ అతని మనసొప్పలేదు. సైన్యంతో అడవికి వెళ్ళి - "నీకు చెందవలసిన రాజ్యం నావంటి అల్పుడు పాలించలేడు. నా తల్లి తప్పును మన్నించి, అయోధ్యకు తిరిగివచ్చి మమ్మలనందరినీ ఏలుకో" అని ప్రార్ధించాడు. తండ్రి మరణవార్త విన్న రాముడు దుఃఖించాడు. కాని "తండ్రి మాట నిలబెట్టడం మన కర్తవ్యం. వనవాస దీక్ష ముగియవలసిందే" అని నిశ్చయించాడు. అప్పుడు భరతుడు - "14 సంవత్సరాల తరువాత నీవు అయోధ్యకు రావడం ఒక్కరోజు ఆలస్యమైనా నేను ప్రాణాలు త్యజిస్తాను. అంత వరకు నీ పాదుకలను సింహాసనంపై ఉంచి, భృత్యునిగా నేను రాజ్యపాలన నిర్వహిస్తాను" అని అయోధ్యకు తిరిగి వెళ్ళాడు.
సీతారామ లక్ష్మణులు మందాకినీ తీరాన చిత్రకూటం అనే సుందర ప్రదేశంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని జపతపాది కార్యములు నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు. వారు అత్రి మహాముని ఆశ్రమాన్ని దర్శించినపుడు సీతమ్మవారు అనసూయ ఉపదేశములు, ఆశీర్వచనములు గ్రహించినది.

అరణ్యకాండము

పర్ణశాలలో సీతారామలక్ష్మణుల జీవనం
శాపవశమున విరాధుడనే రాక్షసుడైన తుంబురుడు రామ లక్ష్మణులచేత శాపవిమోచనం పొందాడు. తరువాత సీతారామలక్ష్మణులు సుతీక్ష్ణుడు, అగస్త్యుడు వంటి మహర్షుల ఆశ్రమాలను దర్శించి, పిదప గోదావరీ తీరాన పంచవటి వద్ద పర్ణశాలను నిర్మించుకొని అక్కడ నివసింపసాగారు. అక్కడకి శూర్పణఖ అనే కామరూపియైన రాక్షసి వచ్చి రామ లక్ష్మణులను మోహించి సీతను తినివేయడానికి సన్నద్ధమైనది. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపాడు. రోదిస్తున్న శూర్పణఖ కసి తీరడానికి ఆమె సోదరులైన ఖర దూషణులనే రాక్షసులు 14 వేల మంది రాక్షసులతో రామునిపై దండెత్తారు. రాముడొకడే వారందరిని హతం చేశాడు.
శూర్పణఖ వెళ్ళి రావణునితో మొరపెట్టుకొంది. కసితో రావణుడు మారీచుడిని మాయలేడి రూపంలో పంపి రామ లక్ష్మణులను దూరంగా వెళ్ళేలా చేసి, తాను సీతను ఎత్తుకుపోయాడు. అడ్డు వచ్చిన జటాయువు రెక్కలు తెగనరికాడు. సీత కనిపించక హతాశులైన రామలక్ష్మణులు ఆమెను వెతుకనారంభించారు. కొనవూపిరితోనున్న జటాయువు వారికి సీతాపహరణం గురించి తెలిపి రాముని చేతిలో కన్నుమూశాడు.
దుఃఖంతో సీతను వెతుకుతున్న రామలక్ష్మణులకు కబంధుడనే రాక్షసుడు ఎదురయ్యాడు. వాడు శాపవిమోచనం పొందుతూ సుగ్రీవునితో మైత్రి చేసుకోమని చెప్పాడు. ఆపై రామలక్ష్మణులు మతంగముని ఆశ్రమంలో వారికోసం ఎదురు చూస్తున్న శబరి ఆతిథ్యం స్వీకరించి, ఋష్యమూకపర్వతానికి బయలుదేరారు.

కిష్కింధకాండము

దస్త్రం:AN01028835 001 l.jpg
అడవిలో రామ లక్ష్మణులను చూచిన హనుమంతుడు.
సుగ్రీవుడు వానరరాజు. అన్న యైన వాలితో దురదృష్టవశాత్తు విరోధము సంభవించగా సుగ్రీవుడు హనుమదాది అనుచరులతోడుగా ఋష్యమూకపర్వతంపై ప్రాణభయంతో కాలం గడుపుతున్నాడు.

హనుమంతుడు రామలక్ష్మణులను కలసి, సుగ్రీవునివద్దకుతోడ్కొని వెళ్ళాడు.రాముడూ, సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. వాలిని వధించి రాముడు సుగ్రీవునకు వానర రాజ్యం కట్టబెట్టాడు. తరువాత సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకూ సీతాన్వేషణ నిమిత్తమై పంపాడు. అలా దక్షిణదిశకు వెళ్ళినవారిలో అంగదుని నాయకత్వంలో హనుమంతుడూ, జాంబవంతుడూ, నీలుడూ, మైందుడూ, ద్వివిదుడూ, సుషేణుడూ వంటి మహావీరులున్నారు.
వారు అంతా కలయజూస్తూ, అనేక అవాంతరాలను అధిగమించి, స్వయంప్రభ అనే యోగిని సాయంతో దక్షిణసముద్ర తీరానికి చేరుకొన్నారు. ఆపై దిక్కు తోచకవారు శోకంలో మునిగిపోయిన వారికి జటాయువు సోదరుడైన సంపాతి కనిపించి, రావణుడు సీతను అపహరించి లంకలో దాచాడని చెప్పాడు.

ఇక నూరు యోజనాల విస్తీర్ణమున్న సముద్రాన్ని దాటి లంకకెలా వెళ్ళాలో తెలియక వానరులు తర్జన భర్జనలు పడసాగారు. అప్పుడు జాంబవంతుడు ఈ కార్యానికి హనుమంతుడే సమర్ధుడనీ, హనుమకు అసాధ్యమైన పని లేదనీ ధైర్యం చెప్పాడు. తన శక్తి తెలిసికొన్న హనుమంతుడు మహాతేజంతో ప్రకాశించాడు.

సుందరకాండము

లంక నుండి తిరిగి వస్తున్న హనుమంతుడు
హనుమంతుడు సన్నద్ధుడై, దేవతలకు మ్రొక్కి, మహేంద్రగిరిపైనుండి లంఘించాడు. దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి, సురస అనే నాగమాత పరీక్షను దాటి, సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని సంహరించి, రామబాణములా లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిణిని దండించి, మయుని అపూర్వ సృష్టియైన లంకలో ప్రవేశించి, సీతను వెదుకసాగాడు.

చిన్నశరీరము ధరించి, హనుమంతుడు రావణుని మందిరములోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ అన్నిచోట్లా సీతను వెదకినాడు. నిద్రించుచున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏమిచేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి సిద్ధపడలేక ఆత్మహత్యకు కూడా ఉపక్రమించబోతుండగా అశోక వనం కనిపిస్తుంది .

రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకూ, వాయువునకూ, సూర్య చంద్రులకూ, మరుద్గణములకూ, బ్రహ్మకూ, అగ్నికీ, సకల దేవతలకూ నమస్కరించి అశోకవనంలో సీతను వెదకడానికి బయలుదేరాడు. అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన సీతను చూచాడు. జాడలెరిగి ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు.

అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి ఆమెను బెదరించి, తనకు వశముకావలెనని ఆదేశించాడు. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మము అగుట తథ్యమని సీత రావణునకు గట్టిగా చెప్పినది. ఒక నెల మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నిస్తూ ఉండటం వల్ల ప్రాణత్యాగం చేయాలని సీత నిశ్చయించుకొన్నది.

వారిలో సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంతకు ఒక కల వచ్చింది. తెల్లని ఏనుగునెక్కి వచ్చి రామ లక్ష్మణులు సీతను తీసికొని పోయినట్లూ, లంక నాశనమైనట్లూ, రావణాదులంతా హతమైనట్లూ వచ్చిన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు. సీతకు శుభ శకునములు కనిపించసాగాయి. [ ఇంక ఆలస్యము చేయరాదని, హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.
హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఊరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చినది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది.

ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణునితో భాషింపవలెననీ, లంకను పరిశీలింపవలెననీ నిశ్చయించుకొన్నాడు. వెంటనే ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, కాలునివలె మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరిపై వ్రాలాడు.

"చూచాను సీతను" అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్నచోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు.

యుద్ధకాండము

లంకకు దారి ఇవ్వవలసిందిగా సముద్రునిపై కోపిస్తున్న రాముడు
హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు "ఇంతటి క్లిష్టకార్యమును మరెవ్వరు సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు. నీవంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనము కంటె నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను" అని హనుమను కౌగిలించుకొనెను . తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. సరైన సమయము చూసి, నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణమునకు పయనమై సాగరతీరము చేరుకొన్నది.
అక్కడ లంకలో రావణుడు యుద్ధము విషయమై తనవారితో చర్చింపసాగాడు. అతని తమ్ముడైన విభీషణుడు రావణునితో విభేదించి, సాగరముదాటి, రాముని శరణు జొచ్చెను. కానున్న లంకాధిపతివని రాముడు విభీషణునకు ఆశ్రయమిచ్చి, కానున్న లంకాధిపతిగా సాగరజలాలతో అభిషిక్తుని చేయించెను. ఇక సాగరమును దాటుటకు అద్భుతమైన వారధి నిర్మాణము విశ్వకర్మ కొడుకైన నలుని పర్యవేక్షణలో ప్రారంభమైనది. అయిదు దినములలో 100 యోజనముల పొడవు, 10 యోజనముల వెడల్పు గల వారధి పూర్తికాగా, వానర భల్లూకసేనల, రామలక్ష్మణులు వారధి దాటి లంకను చేరారు. నీలుని నాయకత్వంలో ఆ సేన మరో సాగరంలా ఉండి, రామకార్యానికి సన్నద్ధమై ఉన్నది.

రావణుని చారుల వల్ల తెలిసిన సమాచారం ప్రకారం వానర సేనా, రామలక్ష్మణులూ అజేయులు, అసమానులు. కనుక యుద్ధం వినాశనహేతువని కొందరు హెచ్చరించారు. కాని ప్రహస్తుని నాయకత్వములోని రావణ సేనాబలం పరాజయం ఎరుగనిది. ముఖ్యంగా ప్రహస్తుడూ, ఇంద్రజిత్తూ, నికుంభుడూ - వీరిలో ఎవరైనా తప్పక రామలక్ష్మణులను కడతేర్చగలరనీ, కనుక ఇక ఇంద్రుని వజ్రాయుధాన్ని గడ్డిపోచలా తలిచే కుంభకర్ణుడూ, తనూ యుద్దానికి రావలసిన అవుసరమే రాదనీ రావణుడి విశ్వాసం.
వానర సైనికులతో పోరాడుతున్న అతికాయుడు
ఇరు పక్షాలవారూ వ్యూహాలు సన్నద్ధం చేసుకొన్నారు. చిట్టచివరి ప్రయత్నంగా రాముడు పనిచిన అంగదరాయబారం విఫలమైనది.
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః
అంటూ వానరసేన లంకను ముట్టడించింది. మహాయద్ధంతో భునభోంతరాళాలు కంపిస్తున్నాయి. వానరులచేతిలో రాక్షసవీరులు భంగపడ్డారు. దానితో ఇంద్రజిత్తు మాయాయుద్ధమారంభించి నాగాస్త్రంతో రామలక్ష్మణులను వివశులను చేసి శతృసైన్యాన్ని భయకంపితులను చేశాడు. అంతా విషణ్ణులైన సమయానికి గరుత్మంతుడు మహాప్రభంజనంలా వచ్చి వారిని నాగబంధాలనుండి విముక్తులను చేశాడు.
మరునాడు హనుమంతుని చేత ధూమ్రాక్షుడూ, అంగదుని చేత వజ్రదంష్ట్రుడూ, నీలునిచేత ప్రహస్తుడూ హతులయ్యారు. రావణుడు స్వయంగా మహావీరులైన రాక్షసగణాలను వెంటబెట్టుకొని యుద్ధానికి వెడలాడు.అప్పుడు జరిగిన భీకరసంగ్రామంలో రావణుని కిరీటము నేలబడింది. ధనుసు చేజారింది. విశ్రాంతి తీసికొని మరునాడు యుద్ధానికి రమ్మని రాముడు రావణుని పంపేశాడు.

అవమాన భారంతో కృంగిన రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుని నిదురలేపి యుద్ధానికి పంపాడు. కుంభకర్ణుడు వానరులను కరకర నమలి మ్రింగుతూ, ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనను నాశనం చేయసాగాడు. లక్ష్మణునిబాణాలు కుంభకర్ణుని నిలువరించాయు. రాముడు దివ్యాస్త్రాలతో వాని బాహువులనూ, ఊరువులనూ ఖండించగా వాడు పర్వతంలా క్రిందపడ్డాడు. వాడి క్రింద పడి ఎందరో రక్షసులు కూడా నశించారు.

శోకిస్తున్న రావణుడిని ఊరడించి మరునాడు దేవాంతక, నరాంతక, అతికాయ, త్రిశిరులనే రావణ నందనులు , మత్తుడు ఉన్మత్తుడు అనే రావణ సోదరులు - అందరూ మహా శూరులు- భీకరమైన యుద్ధానికి దిగారు. వారు అంగదుని, హనుమంతుని, లక్ష్మణుని చేత హతులయ్యారు. ఇక ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. దానితో అందరూ మూర్ఛిల్లారు. రామ లక్ష్మణ హనుమంతులు కూడా బ్రహ్మాస్త్రాన్ని మన్నించక తప్పలేదు. ఎలాగో తెలివి తెచ్చుకొన్న జాంబవంతుడు హిమవత్పర్వతాలలో నున్న ఓషధులు తెమ్మని హనుమకు పురమాయించాడు. హనుమంతుడు పర్వతసమేతంగా ఓషధులను తెచ్చి అందరినీ పునరుజ్జీవితులను చేసి, మరల పర్వతాన్ని యధాస్థానంలో ఉంచి వచ్చాడు.

ఇంద్రజిత్తు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని సాధించడానికి నికుంభిలా యజ్ఙం ఆరంభించాడు. లక్ష్మణుడు అన్న ఆశీర్వాదము పొంది, హనుమంతుని భుజాలపై ఆసీనుడై వెళ్ళి, యజ్ఙాన్ని భంగం చేసి యద్ధానికి తలపడ్డాడు. ఆ భీకర సమరంలో ఆకాశాన్ని బాణాలు కప్పివేశాయి. చివరకు రాముని పేరు చెప్పి సౌమిత్రి సంధించిన ఐంద్రాస్త్రంతో ఇంద్రజిత్తు తల తెగిపడింది.
రామ రావణ యుద్ధము
ఇక రావణుడు మహోదరాది మహావీరులతో యుద్ధానికి వెడలాడు. సుగ్రీవుని చేత మహోదరుడు మరణించాడు. రావణుని మహోగ్రశరధాటికివానర సైన్యము ఛిన్నాభిన్నమైనది. లక్ష్మణుడు దారుణంగా గాయపడ్డాడు.. అప్పుడు రాముడు తనవారిన ఉద్దేశించి - "మీరు సౌమిత్రిని రక్షిస్తూ, యుద్ధం చూస్తూ ఉండండి. నేను రాముడంటే ఏమిటో చూపిస్తాను. రావణ సంహారం చేసి వస్తాను" అన్నాడు. రామ రావణ సంగ్రామం ప్రళయకాలాగ్నివలే చెలరేగినది. రావణుని అస్త్రంతో లక్ష్మణుడు కూలిపోయాడు. రాముడు విలపించసాగాడు. లక్ష్మణుడు కేవలం మూర్ఛిల్లాడని ధైర్యం చెప్పి సుషేణుడు మరల హనుమను మరల గిరిశిఖరానికి వెళ్ళమన్నాడు. హనుమంతుడు శిఖరంతో సహా ఓషధులను తెచ్చి వాసన చూపగా లక్ష్మణుడు లేచి నిలబడి, "అన్నా! ఈ సాయంసంధ్యలో రావణుడు కడతేరాలి అన్నాడు".

రామునకు సహాయంగా ఇంద్రుడు మాతలిని సారధిగా పంపాడు. యుద్ధ పరిశ్రాంతుడై యున్న రామునకు అగస్త్యుడు "ఆదిత్య హృదయము"ను ఉపదేశించాడు. రాముడు దానిని మూడు మార్లు జపించాడు. రాముడు, రావణుడు శరవర్షాన్ని కురిపింపసాగారు. "రామరావణ యుద్ధం రామరావణ యోరివ" - వారి యుద్దానికి మరొకటి పోలిక లేదు - అని దేవగణాలు ఘోషిస్తున్నాయి. రావణుని తలలు తెగి పడుతున్నా మరల మరల మొలుస్తూనే ఉన్నాయి. "రామా! ఇలా కాదు. బ్రహ్మాస్త్రాన్ని సంధించు" అని మాతలి అన్నాడు.

రాముడు సంధించిన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి, తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. రాముడు ఎరపెక్కిన కన్నులతో, శరదళితదేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో, ధనుస్సును నేలకానించి, మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీబంధురాంగుడై త్రిదశపతినుతుడై శోభిల్లాడు. సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు.
అనంతరం సీత అగ్ని ప్రవేశం చేసి తన ధర్మనిరతిని లోకానికి నిరూపించింది. సీతారామలక్ష్మణులు సపరివారంగా అయోధ్యకు తిరిగివచ్చారు. వైభవంగా సీతారాముల పట్టాభిషేకం జరిగింది. {{clear}
పట్టాభిషిక్తులైన సీతారాములు, పరిజనసమేతంగా - జీలకర్రగూడెం గ్రామం ఆలయంలో శిల్పం
 

వాల్మీకి రామాయణము 

బాలకాండ శ్లోకాలు: 61-70 (ప్రథమ సర్గ)

చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికం |
తతో వానర రాజేన వైరానుకధనం ప్రతి ||   ( 61)

రామునితో అగ్నిసాక్షిగా స్నేహమునకు అంగీకరించిన సుగ్రీవుడు, రాముడు చెప్పినదంతా విని, తనకు జరిగిన అన్యాయమును గురించి కూడా రామునికి చెప్పనారంభించెను.    ( 61)

రామాయావేదితం సర్వం ప్రణయాదు:ఖితేన చ |

ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి ||     (62)

తన సోదరుడైన వాలితో తనకు ఉన్న వైరము గురించి మొత్తం రామునకు సుగ్రీవుడు విన్నవించెను. ఈ వృత్తాంతం వినిన రాముడు, ఇన్ని దురాగతాలకు పాలుపడిన వాలిని వధించి సుగ్రీవునకు న్యాయము చేయుటకు ప్రతిజ్ఞ చేసెను.   ( 62)


వాలినశ్చ బలం తత్ర కథయామాస వానర: |

సుగ్రీవశ్శంకితశ్చాసీత్ నిత్యం వీర్యేణ రాఘవే||   (63)

ఇట్లు ప్రతిజ్ఞ చేసిన రామునితో, అక్కడ ఉన్న వానర సైన్యం వాలి యొక్క బల ప్రతాపాలను గూర్చి వివరించుటనారంభించెను. సుగ్రీవుడు, రాముని ధైర్య సాహసాలను తెలుసుకున్నను, వాలితో యుద్ధమునకు రాముడు తగిన వాడేనాయని శంకించెను.  (63)


రాఘవ ప్రత్యయార్థం తు దుందుభే: కాయముత్తమం|

దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభం||   (64)

వాలియొక్క బలమును శ్రీ రామునకు నిరూపించుటకు సుగ్రీవుడు, రామునకు వాలి వధించిన దుందుభి అను రాక్షసుని  కళేబరమును చూపించెను. ఆ కళేబరము చూచుటకు పర్వతమును పోలి ఉన్నది.   (64)


ఉత్స్మయిత్వా మహాబాహు: ప్రేక్ష్య చాస్థిమహాబల: |

పాదాంగుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశయోజనం||  (65)

ఆ కళేబరమును చూసిన రఘురాముడు, సుగ్రీవునివైపు మందహాసముతో చూచి, ఆ కళేబరమును తన కాలి బొతనివేలితో కొట్టెను. ఆ దెబ్బకు ఆ కళేబరము పది యోజనముల దూరమ్న పడెను. ఇది చూచిన తరువాత కూడా రామునిపై సుగ్రీవునకు నమ్మకము కుదరలేదు.  ( 65)


బిభేద చ పున: సాలాన్ సప్తేకైన మహేషుణా|

గిరిం రసాతలం చైవ జనయన్ ప్రత్యయం తదా||  (66)

సుగ్రీవుని నమ్మకమును పెంచుటకు, రాముడు, ఒకే ఒక్క బాణంతో ఏడు సాల వృక్షములను కొట్టెను. ఆ బాణము, వృక్షములను కొట్టుటయే కాక ఒక పర్వతములోనుంచి వెళ్ళి, పాతాళ లోకంలో దాకా వెళ్ళెను.  (66)


తత: ప్రీతమనాస్తేన విశ్వస్త: స మహాకపి:|

కిష్కింధాం రామసహితో జగామ చ గుహాం తదా||   (67)

రాముడు చేసిన పనిని చూసి సుగ్రీవుడు పొంగిపోయెను. రాముడీపైన తన నమ్మకం పెరిగెను. రాముని తో స్నేహము చేసినందుకు సంతోషించి, రామునితో కలిసి కిష్కింధలో తన గుహ దెగ్గరకు బయలుదేరెను.  (67)


తతో గర్జత్ హరివర: సుగ్రీవో హేమపింగళ: |

తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వర: ||   (68)

బంగారము వంటి తేజస్సు కలిగినటువంటి సుగ్రీవుడు, కిష్కింధకు చేరగానే, గర్జన చేయుచూ, వాలిని పిలిచెను. వానర రాజైనటువంటి వాలి, తన గుహలొనుంచి బయటకి వచ్చెను.  (68)


అనుమాన్య తదా తారాం సుగ్రీవేణ సమాగత: |

నిజఘాన చ తత్రైవం శరేణైకేన రాఘవ: ||   (69)

సుగ్రీవుని అరుపులు వినగానే, వాలి గుహనుంచి బయటకు బయలు దేరెను. కానీ,తన భార్య ఐన తార వాలిని వారించెను. సుగ్రీవుడు రామునితో వచి ఉండవచ్చునని, వరితో వైరం వాలికి మంచిది కాదు అని హెచ్చరించెను. వాలి తారను సముదాయించి, సుగ్రీవునితో యుద్ధము చేయనారంభించెను.ఆ యుద్ధము జరుగుతుండగా, వాలిని శ్రీ రాముడు ఒకే ఒక్క బాణముతో నిర్మూలించెను.  (69)


తత: సుగ్రీవవచనాత్ హత్వా వాలినమాహవే|

సుగ్రీవ మేవ తద్రాజ్యే రాఘవ: ప్రత్యపాదయత్ ||   (70)

వాలిని వధించిన తరువాత, శ్రీ రామచంద్రుడు, సురీవుని మరలా కిష్కింధకు రాజుగా పట్టాభిషేకము చేసెను.  (70) 

బాలకాండ శ్లోకాలు: 56-60 (ప్రథమ సర్గ)

తం నిహత్య మహాబాహు: దదాహ స్వర్గతశ్చ స: |
స చాస్య కథయామాస శబరీం ధర్మచారిణిం || (56)

వికృతమైన రూపం కలిగిన ఈ రాక్షసుడిని, అద్భుతమైన శక్తి గల రాముడు త్రుటిలో సంహరించెను. ఆ రాక్షసుడు, స్వర్గలోకాలకు వెడలిపోతూ, రామునితో ఇల చెప్పెను. " ఓ రామా, ఈ అరణ్యములోనే శబరి అనే ఒక గొప్ప తపస్విని ఉన్నది"   (56)

శ్రమణిం ధర్మనిపుణాం అభిగచ్చేతి రాఘవ|

సోభ్యగచ్చన్ మహాతేజా: శబరీం శత్రుసూదన: || (57)

శబరి గురించి చెప్తూ, " ఆ మహా సాధ్వి, సత్య, దయా ధర్మాలకు కట్టుబడినదియై, నిత్యమూ దైవ స్మరణముతో గడిపే మహాత్మురాలు. ఓ రామా, నీవు ఆమె ఆశ్రమానికి వెళ్ళు" అని చెప్పి, కబంధుడు అద్రుశ్యమైయ్యెను. ఈ మాటలను విన్న రామచంద్రుడు, లక్ష్మణునితో కలిసి శబరి ఆశ్రమానికి బయలిదేరెను.   (57)


శబర్యా పూజితస్సమ్యక్ రామో దశరథాత్మజ: |

పంపాతీరే హనుమతా సంగతో వానరేణ హ || (58)

దశరధాత్మజుడైన రామచంద్రుని రాక చూసి, ఆయనని ఆహ్వానించి, అతిధి మర్యాదలు చేసెను. ఆ పంపా నది సమీపంలోనే రామునికి హనుమంతునితో పరిచయమయ్యెను. (58)


హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగత: |

సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్రామో మహాబల: || (59)

హనుమంతుని ద్వారా రామ లక్ష్మణులకు సుగ్రీవునితో పరిచయమయ్యెను. రాముడు సుగ్రీవునికి, హనుమంతునికి తన గాధనంతా వర్ణించెను.  (59)


ఆదితస్తద్యథావృత్తం సీతాయాశ్చ విశేషత: |

సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానర: || (60)

మోదటినుంచీ జరిగినదంతా వివరిస్తూ, సీతాపహరణమును వివరంగా వర్ణించెను. రాముడు చెప్పినదంతా సుగ్రీవుడు శ్రద్ధ గా విని, రామునితో స్నేహమునకు అంగీకరించెను.  (60) 

బాలకాండ శ్లోకాలు: 51-55 (ప్రథమ సర్గ)

న విరోధో బలవతా క్షమో రావణ తేన తే |
అనాదృత్య తు తద్వాక్యం రావణ: కాలచోదిత: ||  (51)

"ఓ రావణా, రామునితో వైరము నీకు అంత మంచిది కాదు. రాముని ధైర్య సాహసాలను తక్కువ అంచనావేసి నీ పతనాన్ని కొనితెచ్చుకోకు. నీ సహోదరి ఐన శూర్పణఖ మాటలు విని రామునితో యుద్ధానికి వెళ్ళిన మన పదునాలుగువేల మంది రాక్షసులను రాముడు అవలీలగా హతమార్చాడు. రామునితో వైరము నీకు కూడా అదే పరిస్థితిని తెచ్చిపెడుతుంది." ఇంతగా రావణాసురుడిని హెచ్చరించినా, మారిచుని మాటలను పెడచెవిన పెట్టాడు రావణాసురుడు.   (51)

జగామ సహమరీచ: తస్యాశ్రమపదం తదా |

తేన మాయావినా దూరం అపవాహ్య నృపాత్మజౌ ||  (52)

ఇలా రావణుడు, మారీచుని వెంట పెట్టుకుని రాముని ఆశ్రమానికి వెళ్ళెను. అక్కడ, రాజ కుమారులైన రామ లక్ష్మణులను, మారీచుని మాయచేత అడవిలోనికి పంపివేసెను.  (52)


జహార భార్యాం రామస్య

గృధ్రం హత్వా జటాయుషం |
గృధ్రం చ నిహతం దృష్ట్వా
హృతాం శ్రుత్వా చ మైథిలీం ||  (53)

రామ లక్ష్మణులను ఆశ్రమానికి దూరంగా పంపివేశాక, రావణాసురుడు సీతను అపహరించి తీసుకుపోతుండగా, జటాయు రావణాసురుని బారినుండి సీతను కాపాడుటకు ప్రయత్నించెను. ఆ ప్రయత్నంలో జటాయు తీవ్రంగా గాయపడెను. సీతను రావణాసురుడు అపహరించెనన్న వార్త రామచంద్రమూర్తి జటాయువు ద్వారా తెలుసుకొనెను. (53)


రఘవశ్శోకసంతప్తో విలలాపాకులేంద్రియ: |

తతస్తేనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషం ||  (54)

సీతను రావణాసురుడు అపహరించెనన్న వార్త విని, రామచంద్రమూర్తి ఎంతో విలపించెను. తన ప్రాణానికి ప్రాణమైన భార్య తననుంచి దూరమైందన్న బాధతో రాముడు చాల విలపించెను. కొంత తేరుకున్న తరువాత, సీతను కాపాడుటకై ప్రయత్నించి తన ప్రాణాలను విడిచిపెట్టిన జటాయుకు రాముడు అంత్యక్రియలు చేసెను.  (54)


మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శ హ|

కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనం ||  (55)

జటాయువుకు అంత్యక్రియలు చేసిన పిమ్మట, రామ లక్ష్మణులు సీతను వెతుకుతూ అడవులలోకి వెళ్ళెను. ఇలా అడవులలో తిరుగుతుండగా ఒక ఘోరమైన రూపం కలిగిన కబంధుడనే రాక్షసుడిని రామ లక్ష్మణులు చూసెను.  (55) 

బాలకాండ శ్లోకాలు: 46-50 (ప్రథమ సర్గ)

తేన తత్రైవ వసతా జనస్థాననివాసినీ |
విరూపితా శూర్పణఖా రాక్షసీ కామరూపిణీ ||  (46)

రాముడు, సీతా లక్ష్మణ సమేతుడై దండకారణ్యంలో నివసిస్తూ ఉండగా, ఒకనాడు, జనస్థానంలో నివసించే కామరూపిణి ఐనటువంటి శూర్పణఖ అనబడే రాక్షసి, రాముడుని మోహించి వచ్చ్చినప్పుడు, తన తమ్ముడైన లక్ష్మణుడితో ఆ రాక్షసి ముక్కు, చెవులూ కోయించేసాడు శ్రీ రాముడు. (46)

తతశ్శూర్పణఖావాక్యాత్ ఉద్యుక్తాన్ సర్వరాక్షసాన్ |

ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసం ||  (47)

శూర్పణఖకు ఇలా జరగగానే, తన అన్నలైన ఖర దూషణుల దెగ్గరకు వెళ్ళి, తనకు జరిగిన అవమానం గురించి చెప్పగా, వారు వారి దెగ్గర ఉన్న పదునాలుగువేల మంది రాక్షసులను రాముడిపైకి యుద్ధానికి పంపెను. (47)


నిజఘాన రణే రామ: తేషాం చైవ పదానుగాన్ |

వనే తస్మిన్ని వసతా జనస్థాన నివాసినాం ||   (48)

మొదటి పదునాలుగువేలమంది రాక్షసులను సమ్హరించిన రాముడు, తరువాత్ వరుసలో వచ్చిన ఖర, దూషణులను, వారి రాక్షస సైన్యంతో సహా రాముడు సమ్హరించెను.  (48)


రక్షసాం నిహతాన్యాసన్ సహస్రాణి చతుర్దశ |

తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణ: క్రోధమూర్చిత: ||  (49)

రాముడు, జనస్థానములో ఉన్నంత కాలము, ఖర, దూషణులతో కలిపి మొత్తం పదునాలుగు వేల మంది రాక్షసులను సమ్హరించెను. తన జ్ఞాతులైన ఖర దూషణుల మరణ వార్త విన్న రావణాసురుడు క్రోధాగ్నితో రగిలిపోయాడు.  (49)


సహాయం వరయామాస మారీచం నామ రాక్షసం |

వార్యమాణస్సుబహుశో మారీచేన స రావణ: ||   (50)

క్రోధము పూనిన రావణాసురుడు, తన జ్ఞాతుల మరణానికి కారణమైనటువంటి వారిపై పగ సాధించవలెనని, మారీచుడు అనే రాక్షసుని సహాయమునకు వెళ్ళగా, అతడు రాముడితో వైరము రావణుడికి మంచిది కాదు అని వారించెను.  (50) 

బాలకాండ శ్లోకాలు: 41-45 (ప్రథమ సర్గ)

ప్రవిశ్య తు మహారణ్యం రామో రాజీవ లోచన: |
విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శ హ ||  (41)

దండకారణ్యములో ప్రవేశించిన తరువాత, విరాధుడు అనే రాక్షసుడిని రామచంద్రమూర్తి సంహరించారు. అటుపిమ్మట, రాముడు, సీతా లక్ష్మణ సమేతుడై శరభంగ మహర్షి ఆశ్రమాన్ని దర్శించెను.   (41)

సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా |

అగస్త్య వచనాచ్చైవ జగ్రాహైంద్రం శరాసనం ||  (42)

సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి, అటు పిమ్మట అగస్త్య మహర్షి ఆశ్రమానికి, అగస్త్య మహర్షి తమ్ముడి ఆశ్రమానికి కూడా వారు వెళ్ళెను. అగస్త్య మహర్షి, ఇంద్రుడు ఇచ్చిన ధనుస్సును రాముడుకి ఇచ్చెను.  (42)


ఖడ్గం చ పరమప్రీత: తూణీ చాక్షయసాయకౌ |

వసతస్తస్య రామస్య వనే వనచరైస్సహ ||  (43)

ధనుస్సుతో పాటు ఒక ఖడ్గము, ధనుస్సు కొశం అక్షయ బాణ తూణీరాలను కూడ ఇచ్చెను. ఆ తూణీరములలో బాణములు ఎన్నటికీ తరగవు. ఇలా శరభంగ మహర్షి యొక్క ఆశ్రమ సమీపములో రాముడు నివసిస్తూ ఉండగా, అడవులలో నివసిస్తున్నవానప్రస్థులు రాముని వద్దకు వచ్చెను.   (43)


ఋషయో భ్యాగమమ్ సర్వే వధాయాసుర రక్షసాం |

స తేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తథా వనే ||  (44)

వానప్రస్థులు రాముడి వద్దకు చేరి, వనాల్లో తిరుగుతూ వారిని బాధిస్తున్న రాక్షసులను సంహరించమని కోరగా, ఏ ఏ వనాలు రాక్షసుల వల్ల బాధపడుతున్నయో ఆ ఆడవులలో ఉన్న రాక్షసులందరినీ సంహరించటానికి రాముడు అంగీకరించెను.   (44)


ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధస్సంయతి రక్షసాం |

ఋషీణామగ్నికల్పానాం దండకారణ్య వాసినాం ||  (45)

అలా అంగీకరించిన రాముడు, అడవులలో ఉండి తపస్సు చేసుకుంటున్న మహా మునులందరిని, ఎవరైతే అగ్ని వంటి తేజస్సు కలిగి ఉన్నారో, వారిని వారి తేజస్సుతో రాక్షసులను నిర్మూలించమని అడిగెను.   (45) 

బాలకాండ శ్లోకాలు: 36-40 (ప్రథమ సర్గ)

త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచోబ్రవీత్ |
రామోపి పరమోదార: సుముఖస్సుమహాయశా: ||   (36)

సహజ దానగుణ శీలుడు, ఉదార స్వభావుడైన రాముడితో భరతుడు అడవులకు వచ్చి " రామా, ఈ రాజ్యానికి నువ్వొక్కడివే రాజువి. ఈ రాజ్యము దశరథ మాహారాజు గారి తరవాత నీకే చెందుతుంది" అని అన్నాడు.   (36)

న చైఛ్ఛత్పితురాదేశాత్ రాజ్యం రామో మహాబల: |

పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పున: పున: ||  (37)

ఎంత బతిమిలాడినా, తన తండ్రి గారికి ఇచిన మాట కోసం రాజ్యాన్ని వొద్దు అను భరతునితో రాముడు చెప్పాడు. ఐనా భరతుడు రాజ్యాన్ని పాలించను అని అనగా, రాముడు, తన పాదుకలను భరతునకు ఇచి, వాటిని తన

స్థానం లో ఉంచమని చెప్పెను.   (37)

నివర్తయామాస తతో భరతం భరతాగ్రజ: |

స కామమనవాప్యైవ రామపాదావుపస్పృశన్ ||  (38)

సింహాసనం మీద పాదుకలను ఉంచి రామాజ్ఞగా రాజ్యాన్ని పాలించమని భరతునకు చెప్పెను. భరతుడు, తన కోరిక తీరనందుకు బాధపడి, రామ పాదుకలకు నమస్కరించి, వాటిని తన శిరస్సున ధరించి బయలుదేరెను.    (38)


నందిగ్రామే కరోద్రాజ్యం రామాగమనకాంక్షయా |

గతే తు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియ: ||   (39)

భరతుడు, అడావులను వదిలి వెళ్ళి, అయోధ్యకు వెళ్ళకుండా నందిగ్రామములోనే నివసిస్తూ, రామ పాదుకలను రాజుగారి స్థానంలో ఉంచి, రామాజ్ఞగా రాజ్యాన్ని పాలిస్తూ, రాముడు ఎప్పుడు అయోధ్యకు తిరిగి వస్తాడో అని ఎదురుచూస్తూ ఉన్నాడు.   (39)


రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ |

తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవివేశ హ ||  (40)

చిత్రకూటంలో రాముడు ఉన్న సంగతి భరతుడి వలన రాజ్యంలో ఉన్న ప్రజలకు తెలిస్తే అందరు తన ఆశ్రమానికి వచ్చేస్తారని గ్రహించి, వాళ్ళు రాకపోయినా భరతుడే మళ్ళీ రావొచ్చని, తన ఆశ్రమాన్ని మర్చుకోవాలను నిర్ణయించుకున్నాడు.    (40) 

బాలకాండ శ్లోకాలు: 31-35 (ప్రథమ సర్గ)

చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ |
రమ్యమావసథం కృత్వా రమమాణా వనే త్రయ: ||  (31)

ఈ ప్రయాణంలో భరద్వాజుని ఈశ్రమము చేరుకుని, ఆయన ఆజ్ఞచే చిత్రకూట పర్వతానికి చేరుకున్నారు. ఆ పర్వతము మీద ఒక సుందరమైన కుటీరము లక్ష్మణుడు నిర్మించెను. అయోధ్యలో ఎంత ఆనందంగా ఉన్నారో, ఈ కుటీరంలో కూడా అంతే ఆనందంగా రాముడు, సీతా, లక్ష్మణుడు ఆ ఆశ్రమం లో గడిపారు.   (31)

దేవగంధర్వసంకాశాస్తత్ర తే న్యవసన్ నుఖం |

చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తథా ||  (32)

అమితోత్సాహంతో ఆ ముగ్గురు, ఆనందంగా ఆ కుటీరంలో గడుపుతున్నారు. ఐతే రాముడు అడవులకు వెడలిపోయాడని దశరథ మహారాజు పుత్రశోకంలో మునిగిపోయాడు.    (32)


రాజా దశరథ: స్వర్గం జగామ విలపన్ సుతం |

మృతే తు తస్మిన్ భరతో వసిష్ఠప్రముఖైర్ద్విజై: || (33)

తన ప్రియ పుత్రుడైన రాముడు అడవులకు వెల్లిపోయాడని విలపించి దశరథ మహారాజు దు:ఖంతో శరీరాన్ని విడిచిపెట్టేశారు. తండ్రి గారు వెళ్ళిపొగానే, అన్నగారైన రాముడు కూడా లేనందున, రాజ్య భారమును వశిష్ఠాది మహర్షులు తమ్ముడైన భరతునకు అప్పగించారు.     (33)


నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబల: |

స జగామ వనం వీరో రామపాదప్రసాదక: ||   (34)

భరతుడు, రాజ్యాన్ని పాలించడానికి తగిన సమర్ధత కలిగినవడైనప్పటికి, తన అగ్రజుడైన రాముడు లేని రాజ్యం తనకు అఖ్ఖరలేదు అని వశిశ్ఠాదులకు చెప్పి, అన్నగారైనటువంటి రాముడితో ఉండటానికి అడవులకు బయలుదేరాడు.   (34)


గత్వా తు స మాహాత్మానం రామం సత్యపరాక్రమం |

అయాచత్ భ్రాతరం రామం ఆర్యభావపురస్కృత: ||   (35)

భరతుడు అడవులకు చేరుకుని, సత్యపరాక్రమవంతుడైన రాముడి పాదాలచెంత చేరి, ఇలా ప్రాధేయపడుతునాడు.    (35) 

సంపూర్ణ రామాయణము

 

 

Sunday, January 13, 2013

గ్రంథాలయము

గ్రంథాలయము

 ప్రజల ఉపయోగార్ధం అన్నిరకముల పుస్తకాలను ఒకేచోట చేర్చి పరిరక్షించు ప్రదేశం గ్రంథాలయము. దీనిని ఆంగ్లమున లైబ్రరీ (Library) అని అంటారు. తెలుగులో గ్రంథాలయాల కొరకు ఉద్యమము నడిపి, దానిని వ్యాప్తి చేసి గ్రంథాలయ పితామహుడు అనే పేరు పొందినవాడు అయ్యంకి వెంకట రమణయ్య. అతని తదనంతరం ఉద్యమాన్ని ఉదృతి చేసి వ్యాప్తి చేసిన క్రియాశీలి వెలగా వెంకటప్పయ్య.

జాతీయ గ్రంథాలయాలు

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జాతీయ గ్రంథాలయం[1] కోల్కతాలో వున్నది. దీనిని 1860 లో స్థాపించారు. 17, 18 వశతాబ్దంలో ప్రచురించిన పుస్తకాలు వున్నాయి. 24 లక్షలకు పైగా పుస్తకాలు (2010 నాటికి) వున్నాయి. వీటిని డిజిటల్ రూపంలోకి మార్చి అందరికి అందుబాటులోవుంచే పని జరుగుతున్నది. అలాగే భారత డిజిటల్ లైబ్రరీ [2] కూడా, వివిధ పుస్తకాలను కంప్యూటర్ లో భద్రపరచి అందరికి అందుబాటులోకి తెస్తున్నది.

ఆంధ్రప్రదేశ్ లో గ్రంథాలయాలు

రాష్ట్ర గ్రంథాలయ సంస్థ [3] 7 ప్రాంతీయ, 23 జిల్లా కేంద్ర, 1449 మండల, 357 గ్రామ, 1396 బిడిసి (పుస్తక జమ కేంద్రం ‌ ‌‌Book Deposit Centers)గ్రంథాలయాలను నిర్వహిస్తున్నది. భారత డిజిటల్ లైబ్రరీ[4]ప్రాజెక్టు లో భాగంగా, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, నగర కేంద్ర గ్రంథాలయం లోని ఎంపిక చేసిన పుస్తకాలను స్కానింగు చేసి భారత డిజిటల్ లైబ్రరీ ద్వారా అందజేస్తున్నారు. ఏప్రిల్ 2010 నాటికి 14343 తెలుగు పుస్తకాలు లభ్యమవుతున్నాయి.

భారత డిజిటల్ లైబ్రరీ


భారత డిజిటల్ లైబ్రరీ ముఖపత్రం
భారత డిజిటల్ లైబ్రరీ (Digital Library of India) [1] [2] [3] ప్రాజెక్టులో మనదేశములోని వివిధ భాషలలోని పుస్తకాలను డిజిటల్ రూపంలోకి మార్చి అంతర్జాలం ద్వారా ఎవరైనా చదివే లేక పొందే ఏర్పాటు కలది. ఈ ప్రాజెక్టు సార్పత్రిక డిజిటల్ లైబ్రరీలో భాగంగా చేపట్టబడింది. భారత డిజిటల్ లైబ్రరీప్రాజెక్టు లో భాగంగా, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, నగర కేంద్ర గ్రంథాలయం లోని ఎంపిక చేసిన పుస్తకాలను[4] స్కానింగు చేసి అందజేస్తున్నారు. ఏప్రిల్ 2010 నాటికి రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, నగర కేంద్ర గ్రంథాలయం తరపున 14,343 తెలుగు పుస్తకాలు లభ్యమవుతున్నాయి.జులై 2012 నాటికే మొత్తం భాగస్వామ్యాలద్వారా 23361 పైగా తెలుగు పుస్తకాలు 4,480,653 మొత్తం పేజీలతో డిజిటల్ రూపంలో (బొమ్మ) అందుబాటులో వున్నాయి. అన్ని భాషలలో కలిపి 3,47,462 పుస్తకాలు, 123,390,315 మొత్తం పేజీలు డిజిటైజ్ చేయబడ్డాయి. [5]. పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో డిజిటల్ లైబ్రరీ ఫథకాలకు 70కోట్ల రూపాయల ప్రణాళిక తయారుచేయబడింది. [6]

చదువుటకు సూచనలు

వెబ్సైట్ లో చదువుటకు టిఫ్ (TIFF) బొమ్మలు చూపెట్టగలిగే ఉపకరణము, మీ విహరిణిలో స్థాపించుకోవాలి. ఇంటర్నెట్ ఎక్సోప్లోరర్ వాడితే ఆల్టెర్నాటిఫ్(alternatiff) వాడాలి. లినక్స్ ఫైర్‌ఫాక్స్ వాడుకరులు, మొజ్‌ప్లగ్గర్(mozplugger) పొడిగింతను స్థాపించుకోవాలి. ఫైర్పాక్స్ (3.6.3)లో ఒక పేజి చూపించే లింకు మాత్రమే పనిచేస్తున్నది. పేజీలు తిప్పడానికి, క్రింద వున్న వచ్చే ప్రేమ్లో క్రిందదాక పోవాలి( పేజీ డౌన్ చేయాలి).

అతి చిన్న పుస్తకాల లైబ్రరీ...ఫోటోలు

అందరమూ అతి చిన్న పుస్తకాన్ని చూసే ఉంటాము. కానీ అలాంటి చిన్న పుస్తకాల లైబ్రరీ ఉన్నదంటే నమ్మకం కలగటంలేదు. కానీ ఉన్నదన్నదే నిజం. ఫ్రాన్స్ దేశానికి చెందిన జాజ్ సెఫ్ టరీ అనే ఆయన 1969 నుండి మినీ పుస్తకాలను సేకరిస్తూ 4500 చిన్న పుస్తకాలతో ఒక లైబ్రరీ మొదలుపెట్టేరు. ఆయన దగ్గరున్న చిన్న పుస్తకాలలోనే అతి చిన్న పుస్తకం సైజు 0.11 x 0.12 ఇంచ్ లు. జెనెరల్ నాలెడ్జె,స్పోర్ట్స్,రాజకీయం, సంగీతం మరియూ మతం కు చెందిన పుస్తకాలు ఉన్నాయట.











 

 

 

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు (Indian Institute of Technology హిందీ: भारतीय प्रौद्योगिकी संस्थान) భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యా సంస్థలు. ప్రస్తుతం భారతదేశంలో పదిహేను ఐఐటీలు ఉన్నాయి. వీటన్నింటికీ స్వయంప్రతిపత్తి అధికారాలు ఉన్నాయి. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏర్పడ్డ ఈ కళాశాలలకు భారత ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యతను కల్పించింది. ఐఐటీలు ప్రాథమికంగా శాస్త్రవేత్తలనూ, ఇంజనీర్లనూ సమాజం యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి ఏర్పరచబడ్డాయి. ఐఐటీ విద్యార్థులు సాధారణంగా ఐఐటియన్లుగా వ్యవహరించబడతారు.
వీటిన స్థాపించిన తేదీల ప్రకారం చూస్తే, ఖరగ్ పూర్, ముంబై, చెన్నై, కాన్పూర్, ఢిల్లీ, గౌహతి, రూర్కీ వరసలో ఏర్పరచబడ్డాయి. కొన్ని ఐఐటీలు యునెస్కో, జర్మనీ, అమెరికా, సోవియట్ యూనియన్ సహకారంతో ప్రారంభించబడ్డాయి. 2008లో హైదరాబాద్, రాజస్తాన్, భువనేశ్వర్, పాట్నా, గాంధీనగర్, పంజాబ్ లలో కొత్త ఐఐటీలు ఏర్పరచబడ్డాయి. 2009లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండిలో మరియు ఇండోర్లో మరో రెండు కొత్త ఐఐటీలు స్థాపించబడ్డాయి.
ఐఐటిలలో చదివిన విద్యార్థులు అన్ని రంగాలలో ముందుండి, ఆయా రంగాలలో తమదైన ముద్ర వేశారు. వీటికున్న స్వయంప్రతిపత్తి అధికారం వలన ఇవి ఇతర భారతీయ యూనివర్సిటీల్లో ఇచ్చే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (BE) కాక (B.Tech) డిగ్రీని బ్యాచిలర్ విద్యార్థులకు అందజేస్తాయి. ఐఐటీలు విజయవంతం కావడంతో, వీటిని పోలిన ఐఐఎమ్ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్), ఎనైటీ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ఐఐఐటీ మొదలైన సంస్థలు కూడా ప్రారంభించేందుకు వీలు కలిగింది.

విషయ సూచిక

ఐఐటీ సంస్థలు

పాత ఐఐటీలు

ప్రస్తుతం ఉన్న ఏడు ఐఐటీలు ఖరగ్‌పూర్, ముంబై, చెన్నై, కాన్పూర్, ఢిల్లీ, గౌహతి, రూర్కీ లో ఉన్నాయి. అన్నీ సంస్థలకూ స్వయంప్రతిపత్తి అధికారాలు ఉండటం వలన వాటి పాఠ్యప్రణాళికలను అవే రూపొందించుకుంటాయి.
మొట్ట మొదటిదైన ఐఐటీ ఖరగ్‌పూర్ ని 1951 లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన కలకత్తా కు దగ్గరలో ఉన్న ఖరగ్‌పూర్ లో స్థాపించారు. ఇది 2,100 ఎకరాల సువిశాల విస్తీర్ణం కలిగినది. మొత్తం 29 విభాగాలు ఉన్నాయి. ఇందులో 450 అధ్యాపకులు, 2,200 మంది ఉద్యోగులు, 3,000 అండర్ గ్రాడ్యుయేట్లు మరియు 2,500 పోస్టు గ్రాడ్యుయేట్లు ఉంటారు. ఇక్కడున్న కేంద్ర గ్రంథాలయం ఆసియా లోనే అతిపెద్ద సాంకేతిక గ్రంథాలయం.[1]
ఐఐటి బొంబాయి ప్రధాన భవనం

ఇక రెండవ ఐఐటీని మహారాష్ట్ర రాజధాని అయిన ముంబై సమీపంలో పోవై అనే ప్రాంతంలో 1958 లో స్థాపించారు. దీనికోసం యునెస్కో మరియు సోవియట్ యూనియన్ సాంకేతిక సహకారాన్ని అందించాయి.మిగతా ఖర్చును భారత ప్రభుత్వం భరించింది.ఇందులో నిర్మాణ పరమైన ఖర్చులు, మొదలైనవి ముఖ్యమైనవి. [2] 550 ఎకరాల విస్తీర్ణంతో 24 విభాగాలతో ఇది మహారాష్ట్రలో అతి పెద్ద విశ్వవిద్యాలయం.అంతేకాకుండా ఈ ఐఐటీలో 13 హాస్టల్ భవనాలున్నాయి. వీటిలో 2,200 మంది అండర్ గ్రాడ్యుయేట్లు మరియు 2,000 పోస్టు గ్రాడ్యుయేట్లు ఉంటారు. ఇక్కడ శైలేష్ మెహతా స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ అనే మేనేజ్ మెంట్ విద్యా కేంద్రం మరియు కన్వల్ రేఖీ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే ప్రత్యేక విభాగం కూడా ఉంది. బొంబాయి పేరు ముంబై గా పేరు మారిన ఇది ఐఐటీ బొంబాయి గానే పేరుంది.
మూడవ ఐఐటీ తమిళనాడు రాజధాని అయిన చెన్నై లో ఉంది. దీనిని కూడా ఇప్పటికీ ఐఐటీ మద్రాసు గానే సంభోదించడం జరుగుతుంది.దీన్ని 1959 లో పశ్చిమ జర్మనీ సహకారంతో వ్యవస్థాపన గావించారు.[3] ఇందులో సుమారు 360 మంది అధ్యాపకులు, 2,500 మంది అండర్ గ్రాడ్యుయేట్లు మరియు 2,000 పోస్టు గ్రాడ్యుయేట్లు ఉంటారు. విస్తీర్ణం 620 ఎకరాలు. ఇక్కడ 15 విభాగాలు, సుమారు 100 ప్రయోగశాలలు, మరియు 14 హాస్టల్ భవనాలు ఉన్నాయి.
నాలుగవదైన ఐఐటీని ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ నగరంలో 1959 లో స్థాపించారు. మొదటి పది సంవత్సరాలపాటు ఈ ఐఐటీ భారత అమెరికా పథకంలో భాగంగా 9 అమెరికా యూనివర్సిటీ లతో కూడిన బృందం ఇక్కడ పరిశోధనాలయాలనూ, కోర్సులను రూపొందించడం లో సహాయపడింది. [4]దీని విస్తీర్ణం 1200 ఎకరాలు. 10 హాస్టల్ భవనాలు ఉన్నాయి. ఇక్కడ 500 మంది అధ్యాపకులు మరియు సుమారు 2,000 మంది అండర్ గ్రాడ్యుయేట్లు మరియు అంతే సంఖ్యలో పోస్టు గ్రాడ్యుయేట్లు కూడా ఉంటారు.
ఐఐటీ గౌహతి పైనుంచి చూస్తే
ఈశాన్య రాష్ట్రమైన అస్సాం రాజధాని గౌహతి లో బ్రహ్మపుత్రా నది ఉత్తరపు ఒడ్డున ఐదవ ఐఐటీని 1994లో స్థాపించారు. చుట్టూ కొండల మధ్య రమణీయమైన ప్రకృతి ఒడిలో సుమారు 700 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఇది కొలువు తీరి ఉండటం వలన ఇక్కడికి పర్యాటకులు కూడా విచ్చేస్తుంటారు.[5] ఇక్కడ సుమారు 1,300 అండర్ గ్రాడ్యుయేట్లు, 500 మంది పిజి విద్యార్థులు, 18 విభాగాలు, మరియు 152 మంది అధ్యాపకులు ఉన్నారు.
ఆరవదైన ఐఐటీ రూర్కీ ముందు రూర్కీ విశ్వవిద్యాలయంగా పిలవబడేది. రూర్కీ విశ్వవిద్యాలయం 1847లో ఆంగ్లేయుల కాలంలో ఏర్పడ్డ మొట్ట మొదటి విశ్వవిద్యాలయం.[6]ఇది ఉత్తరాఖండ్ లో ఉంది. 1854 నుంచీ థామ్సన్ కాలేజ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ అనే పేరుతో ఉన్న సంస్థ 1949 లో రూర్కీ విశ్వవిద్యాలయంగా పేరు మార్చుకొంది.మరలా 2001 ఐఐటీ రూర్కీగా రూపాంతరం చెందింది.

కొత్త ఐఐటీలు

ఐఐటీ రోపార్ (పంజాబ్) - ఐఐటీ ఢిల్లీ పరిధిలోనిది
ఐఐటీ మండీ(హిమాచల్ ప్రదేశ్) - ఐఐటీ రూర్కీ పరిధిలోనిది
ఐఐటీ భువనేశ్వర్ - ఐఐటీ ఖరగ్‌పూర్ పరిధిలోనిది
ఐఐటీ హైదరాబాద్ - ఐఐటీ మద్రాస్ పరిధిలోనిది
ఐఐటీ గాంధీనగర్ - ఐఐటీ బాంబే పరిధిలోనిది
ఐఐటీ పాట్నా
ఐఐటీ రాజస్థాన్ - ఐఐటీ కాన్పూర్ పరిధిలోనిది
ఐఐటీ ఇందోర్ - ఐఐటీ బాంబే పరిధిలోనిది

రాబోయే ఐఐటీలు

ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ కు ఐఐటీ హోదా ఇవ్వాలని ఝార్ఖండ్ ప్రభుత్వం సెప్టెంబర్ 2011లో ప్రతిపాదించింది. కేరళ రాష్ట్ర విద్యాశాఖామంత్రి పి.కె అబ్దు రబ్బ్ గారి ప్రకటన ప్రకారం, కేరళలోని పాలక్కాడ్ వద్ద కొత్త ఐఐటీ ప్రతిపాదించబడినది. అలాగే కర్ణాటకలోని ముద్దెనహళ్ళి వద్ద కూడా ఐఐటీ ఏర్పాటు చేసే ప్రతిపాదన 2009లో చేయబడింది. 2011, జనవరిలో విశ్వేశ్వర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలకి ఐఐటీ హోదా కల్పించి కర్ణాటక ఐఐటీగా చేయాలని ప్రతిపాదించబడినది.

పరిపాలనా వ్యవస్థ

ఐఐటీల పరిపాలనా వ్యవస్థ
ఐఐటిల పరిపాలనా వ్యవస్థలో భారత రాష్ట్రపతి అతున్నత స్థాయిలో ఉంటాడు. ఆయన క్రింద ఐఐటీ కౌన్సిల్ ఉంటుంది. ఈ కౌన్సిల్ లో కేంద్ర ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖా మంత్రి, అన్ని ఐఐటీల చైర్మన్లు, అన్ని ఐఐటీల డైరెక్టర్లు, యూనివర్సిటీ గ్రాంట్సు కమీషన్ చైర్మన్, CSIR (కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) చైర్మన్, IISc (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్) చైర్మన్, మరియు డైరెక్టర్, ముగ్గురు పార్లమెంటు సభ్యులు, మానవ వనరుల అభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి మరియు కేంద్ర ప్రభుత్వం , AICTE( ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్), మరియు రాష్ట్రపతి ప్రతిపాదించిన ముగ్గురు సభ్యులు ఉంటారు.
ఐఐటీ కౌన్సిల్ క్రింద ప్రతి ఐఐటీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. వీరి క్రింద సంస్థ యొక్క డైరెక్టర్ ఉంటాడు. సంస్థ మొత్తానికీ ఈయనే ముఖ్య నిర్వహణాధికారి. డైరెక్టర్ల క్రింద డిప్యూటీ డైరెక్టర్లు ఉంటారు. ఇంకా క్రిందకు వెళితే డీన్లు, విభాగాధిపతులు, రిజిస్ట్రార్లు, విధ్యార్థి సంఘం యొక్క చైర్మన్, హాల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఉంటారు. విభాగాధిపతుల కింద ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఉంటారు.వార్డెన్లు హాల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ క్రింద ఉంటారు.

ప్రవేశార్హతలు

ఐఐటీ ఢిల్లీ లో గణితశాస్త్ర విభాగం
అన్ని ఐఐటీలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష (JEE) ద్వారా బ్యాచిలర్ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతాయి. ప్రతియేటా సుమారు 350000 మంది పరీక్షకు హాజరయితే అందులోంచి కేవలం 5000 మంది విద్యార్థులు మాత్రమే ఐఐటీలలో ప్రవేశం దక్కుతుంది. ఎంటెక్ కోర్సులకు GATE (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్)పరీక్ష ద్వారానూ, ఎంఎస్సీ కోర్సులకు JAM పరీక్ష ద్వారా, M.Des కోర్సులకు CEED పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. అన్ని ఐఐటీలలో కలిపి సుమారు 15 వేల మంది అండర్ గ్రాడ్యుయేట్లు, 12 వేలమంది పోస్టు గ్రాడ్యుయేట్లు, మరియు పరిశోధనా విద్యార్థులు విద్యనభ్యసిస్తుంటారు.

రిజర్వేషన్లు

భారతీయ రాజ్యాంగాన్ని అనుసరించి అన్ని ఐఐటీలలో 1973 నుంచి షెడ్యూల్డు కులాల వారికి రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఐఐటిల ప్రవేశ విధానం ప్రకారం మొత్తం సీట్లలో 15% షెడ్యూల్డు కులాల వారికీ 7.5% షెడ్యూల్డు తెగల వారికీ కేటాయించ బడ్డాయి.
ఇతర వెనుకబడిన వర్గాలవారికి రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమీషన్ నివేదిక సమర్పించినా 2006 వరకూ ఈ వర్గానికి ఎటువంటి రిజర్వేషన్లు కల్పించబడలేదు. ఐఐటీలు ఈ సీట్లు ఖచ్చితంగా నింపాలి అనే నియమమేమీ లేదు. ఐఐటీలు విద్యార్థులను ఎంపిక చేసే విధానాల్ని బట్టి వీటిలో చాలా సీట్లు ఖాళీగానే ఉన్నాయి. 2004 వ సంవత్సరంలో షెడ్యూల్డు తెగల వారికీ కేటాయించ బడ్డ 279 సీట్లలో 112, షెడ్యూల్డు కులాల వారికి కేటాయించబడ్డ 556 సీట్లలో 11 ఖాళీగానే ఉండిపోయాయి.

విద్య

కేల్కర్ గ్రంథాలయం, ఐఐటీ కాన్పూర్
ఐఐటీలకు భారతదేశంలో మరే ఇతర ఇంజనీరింగ్ కళాశాల పొందనన్ని నిధులు భారత ప్రభుత్వం సమకూరుస్తుంది. [7]ఐఐటీలకు తప్ప మిగతా ఇంజనీరింగ్ కళాశాలలకు భారత ప్రభుత్వం ఇచ్చే వార్షిక బడ్జెట్ రూ-100 - 200 మిలియన్లయితే ఒక్కో ఐఐటీకీ ప్రభుత్వం ఇచ్చే నిధులు రూ- 900-1,300 మిలియన్ల మధ్యలో ఉంటుంది. ఇంకా విద్యార్థుల ఫీజుల రూపంలో, పరిశోధనల కోసం పరిశ్రమలు ఇచ్చే నిధులు కూడా అధనంగా సమకూరుతాయి. ఈ నిధుల వల్ల ఐఐటీలలో సదుపాయాలు మెరుగవడమే కాకుండా మంచి అధ్యాపకులనూ సమకూర్చుకోగలుగుతోంది.దీని వలన విద్యార్థులలో కూడా ఐఐటీలలో ప్రవేశం పొందాలనే పోటీ తత్వం కూడా పెరుగుతోంది. ఐఐటీలలో అధ్యాపకులు-విద్యార్థి నిష్పత్తి 1:6 నుంచి 1:8 మద్యలో ఉంటుంది.[8]

ఈ నిష్పత్తి అథమ పక్షంలో ప్రతి విభాగానికీ 1:9 కి దాటరాదని ఐఐటీ కౌన్సిల్ ప్రతిపాదిస్తోంది. ఐఐటీలలో అండర్ గ్రాడ్యుయేషన్ చేసేవారికి 80% ఫీజు రాయితీ ఉంటుంది. ఉన్నత విద్యను ప్రోత్సహించడం కోసం టక్కర్ కమిటీ(1959-1961) సిఫారసు మేరకు పిజి మరియు పరిశోధనా విద్యార్థులందరికీ ఉపకారవేతనాలను అందించడం జరుగుతుంది. [9] ఇక యుజి విద్యార్థులకు సంవత్సరానికి సాలీనా ఖర్చయ్యేది (ఉండడానికి మరియు భోజన సదుపాయాలు) సుమారు యాభై వేల రూపాయలు.

అన్ని ఐఐటీలు స్వయంప్రతిపత్తితోనే పని చేస్తాయి. వాటికి కల్పించిన జాతీయ ప్రాముఖ్యత వలన నిర్వహణాపరమైన సౌలభ్యం సమకూరడమే కాకుండా ప్రాంతీయ మరియు కేంద్ర రాజకీయాలకు అతీతంగా నడిపే అధికారం కూడా కలిగింది. ఈ అధికారాల వలన ఐఐటీలు ప్రభుత్వ జోక్యం లేకుండా వేటికవే సిలబస్ ను రూపొందించుకోగలవు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా తన విద్యా విధానాన్ని మార్చుకోగలవు. ప్రభుత్వానికి అధ్యాపకుల నియామకం, సిలబస్ వంటి విషయాలపై ప్రత్యక్షంగా అధికారం లేక పోయినా ఐఐటీ కౌన్సిల్ రూపంలో ప్రాతినిధ్యం లభిస్తుంది. అన్నీ ఐఐటీలలోనూ ఆంగ్ల మాధ్యమం లోనే విద్యా భోధన జరుగుతుంది.[10] సాధారణంగా తరగతులు ఉదయం 7:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకూ జరుగుతుంటాయి. కొన్ని ఐఐటీలు ఇందుకు మినహాయింపు కావచ్చు. అన్ని ఐఐటీలలో అందరు విద్యార్థులకు అందుబాటులో గ్రంథాలయాలు ఉంటాయి. సిలబస్ లో నిర్దేశించిన పుస్తకాలే కాక ఇతర సాహిత్య ప్రక్రియలకు సంభందించిన పుస్తకాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఎలక్ట్రానిక్ విప్లవం ఇప్పుడు అన్ని గ్రంథాలయాల్లో ఆన్‌లైన్ లో పరిశోధనా పత్రాలను చదువుకోగలిగే సౌకర్యం కలిగింది.
ఐఐటీలలో అకాడమిక్ విధానాలను అకాడమిక్ సెనేట్ నిర్ణయిస్తుంది. ఈ సెనేట్ లో ప్రొఫెసర్లందరూ మరియు విద్యార్థుల నుంచి ప్రతినిథులు ఉంటారు. పాశ్చాత్య విశ్వవిద్యాలయాలలో ఈ సెనేట్ ను వోటు ద్వారా ఎన్నుకుంటారు. ఈ సెనేట్ సిలబస్ నూ కోర్సులనూ, పరీక్షలనూ, ఫలితాలనూ, నియామకాలనూ కొన్ని క్రమశిక్షణా చర్యలనూ పర్యవేక్షిస్తుంది.విద్యా ప్రమాణాలు పాటించడానికి భోధన, శిక్షణ మరియు పరిశోధనా కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. [11] డైరెక్టరు ఈ సెనేట్ కమిటీ కి అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు.

అన్ని ఐఐటీలలో విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడానికి క్రెడిట్ విధానాన్ని అవలంభిస్తారు. కోర్సుల యొక్క ప్రాముఖ్యతను బట్టి ఒక్కో కోర్సుకు ఎన్ని క్రెడిట్లు ఉండాలో నిర్ణయిస్తారు. 100 మార్కులకు ఎన్ని మార్కులు వచ్చాయన్నదాన్ని బట్టి గ్రేడ్ ను నిర్ణయించడం జరుగుతుంది. ఒక్కో మార్కుల రేంజికి ఒక్కో గ్రేడ్ (10 లోపు) ఉంటుంది. ఒక్కోసారి తరగతి మొత్తం ప్రతిభను పరిగణనలోకి తీసుకుని రిలేటివ్ గ్రేడింగ్ విధానాన్ని కూడా అనుసరించడం జరుగుతుంది. ప్రతీ అర్థ సంవత్సరానికి (సెమిస్టర్) ఒకసారి పరీక్షలు నిర్వహించి ఆ సెమిస్టర్ లోని కోర్సులలో ఒక విద్యార్థి సాధించిన గ్రేడ్ల సగటును లెక్కిస్తే వచ్చేది సెమిస్టర్ గ్రేడ్ పాయింట్ యావరేజ్(SGPA). అలాన్ని SGPA లకు సగటును లెక్కిస్తే క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ (CGPA) వస్తుంది.

అండర్ గ్రాడ్యుయేట్ విద్య

ఐఐటీ మద్రాసు గ్రంథాలయం
ఐఐటీల నుంచి ఎక్కువగా బిటెక్ గ్రాడ్యుయేట్లు ఎక్కువగా బయటకు వస్తుంటారు. కొద్ది మంది డ్యుయల్ డిగ్రీ కోర్సులకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. బిటెక్ కోర్సు కాల వ్యవధి నాలుగు సంవత్సరాలు. విద్యార్థి ఎనిమిది సెమిస్టర్లను పూర్తి చేయాల్సి ఉంటుంది.[12]డ్యుయల్ డిగ్రీ కోర్సు కాల వ్యవధి ఐదు సంవత్సరాల పాటు ఉంటుంది. మొదటి సంవత్సరం అన్ని బిటెక్ మరియు డ్యుయల్ డిగ్రీ కోర్సుల విద్యార్థులకు ఒకే కోర్సు స్ట్రక్చర్ ఉంటుంది. [13] కొన్ని విభాగాలలో దానికి సంభందించిన ప్రాథమిక సబ్జెక్టులను కూడా చేరుస్తారు.[14] ఈ కామన్ కోర్సులు అన్ని ఇంజనీరింగ్ విభాగాలకు (ఎలక్ట్రానిక్స్, యాంత్రిక శాస్త్రము, రసాయన శాస్త్రము, భౌతిక శాస్త్రము) సంభందించిన ప్రాథమిక భావనలను విద్యార్థులకు పరిచయం చేస్తారు. మొదటి సంవత్సరం తరువాత విద్యార్థుల ప్రతిభను ఆధారంగా చేసుకుని వేరే విభాగానికి మారడానికి కూడా అవకాశం కల్పించబడుతుంది.[15] కానీ ఈ విధానం కేవలం మెరిట్ విద్యార్థులకు మరియు ఖచ్చితమైన విధానాలతో కూడుకొన్నది కావున దీని ద్వారా కొద్ది మార్పులు మాత్రమే జరుగుతాయి.[15]
రెండవ సంవత్సరం నుంచి విద్యార్థులు తమ తమ విభాగాలలోని సబ్జెక్టులను అభ్యసిస్తారు.[16] ఇవికాక అందరు విద్యార్థులు తమ విజ్ఞాన పరిధిని పెంచడం కోసం ఇతర విభాగాల నుంచి కూడా కొన్ని తప్పనిసరి సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ కోర్సులు హ్యుమానిటీస్ నుంచి గానీ సోషియల్ సైన్సెస్ నుంచి గానీ మేనేజ్‌మెంట్ విభాగాల నుంచి ఉంటాయి.[17] మాడవ సంవత్సరం చివరలో విద్యార్థులు సమ్మర్ ప్రాజెక్టును ఏదైనా పేరొందిన కంపెనీ నుంచి గానీ పేరొందిన విద్యాసంస్థ నుంచి గానీ కోర్సులో భాగంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. చాలామంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్ల ద్వారా కంపెనీలకు సెలెక్ట్ అయినా కొద్ది మంది ఉన్నత విద్యకోసం లేక వారికి ఇష్టం వచ్చిన కంపెనీలో చేరడానికి వీలుగా వీటికి దూరంగా ఉంటారు.[18]

ఉన్నత విద్య

ఐఐటీలలో ఎంటెక్, ఎంబీయే, ఎమ్మెస్సీ, PGDIT, MMST, MCP, PGDIPL, M.Des, PGDMOM మొదలైన అనేక పోస్టుగ్రాద్యుయేట్ కోర్సులను అందిస్తాయి. పరిశోధనా విద్యార్థుల కోసం పీహెచ్‌డీ లను కూడా అందిస్తాయి. పీహెచ్‌డీ లో విద్యార్థి ఒక ప్రొఫెసర్ సూచించిన సమస్య పైన లేదా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రాజెక్టు పైన పని చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సు యొక్క కాలవ్యవధి నిర్దిష్టంగా ఉండదు. ఇది విద్యార్థులు పరిశోధన చేసే అంశాలపై ఆధారపడి ఉంటుంది. పరిశోధన అనంతరం వారు పరిశోధనావ్యాసాన్ని సమర్పించాల్సి ఉంటుంది మరియు వారి పరిశోధనను సమర్థించుకోవాల్సి ఉంటుంది. పరిశోధన సమయంలో భోధనావకాశాలను కూడా కల్పించడం జరుగుతుంది. కొన్ని ఐఐటీలు ఎమ్మెస్ (M.S) కోర్సును కూడా అందిస్తున్నాయి. ఎంటెక్ మరియు ఎమ్మెస్ కు తేడా ఉన్నదల్లా వ్యాసాన్ని (Thesis) ను సమర్పించడమే. ఐఐటీలు, ఐఐఎస్సీ, ఎనైటీలు కలిపి ఇంజనీరింగ్ లో 80% PhD లను విడుదల చేస్తున్నాయి.[19]
ఐఐటీలు బిటెక్ మరియు ఎంటెక్ కోర్సులకు కలిపి కొన్ని డ్యుయల్ డిగ్రీ కోర్సులను కూడా అందిస్తున్నాయి. వీటిలో అండర్ గ్రాడ్యుయేట్ మరియు గ్రాడ్యుయేట్ కోర్సులను మిళితం చేస్తారు. దీని కాలవ్యవధి ఐదు సంవత్సరాలు.[20] విడివిడిగా బిటెక్ మరియు ఎంటెక్ చేయడం వలన ఆరు సంవత్సరాలు పడుతుంది.[21] ఈ విధమైన కోర్సు విధానం ఐఐటీ విద్యార్థులు పోస్టుగ్రాడ్యుయేషన్ కు వేరే విద్యాసంస్థకు వెళ్ళకుండా ఉండేందుకు ఉపకరిస్తుంది. ఒక్క ఐఐటీ గౌహతి తప్ప మిగిలిన ఐఐటీలన్నీ మేనేజ్‌మెంట్ పై కోర్సులను అందిస్తున్నాయి (చూడండి: భారతదేశంలో విద్య )

సంస్కృతి మరియు విద్యార్థి జీవితం

అన్ని ఐఐటీలు విద్యార్థులకూ, ఉపాధ్యాయులకూ, పరిశోధనా విద్యార్థులకూ క్యాంపస్ లోపలే వసతి సౌకర్యాలు కల్పించబడతాయి. విద్యార్థులు తాము చదివినంతకాలం హాస్టళ్ళలోనే ఉంటారు. విద్యార్థులు తమ మొదటి సంవత్సరంలో NSS కానీ, NCC కానీ , NSO కానీ ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది. అన్ని ఐఐటీలలో క్రికెట్,వాలీబాల్,హాకీ,బాస్కెట్ బాల్,లాన్ టెన్నిస్, బ్యాడ్మింటన్ మొదలైన ఆటలకోసం మైదానలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఐఐటీలలో వినోద సౌకర్యాలకూ కొదవలేదు. అన్ని భాషల సినిమాలు ప్రదర్శించడానికి అనువుగా ఓపెన్ ఎయిర్ థియేటర్లు కూడా ఉంటాయి. ఇవి కాక ప్రతీ ఐఐటీ ప్రతీ యేటా సాంస్కృతిక సంబరాలను కూడా జరుపు కొంటుంటాయి. ఈ సంబరాలలో బయటి కళాశాలల్ విద్యార్థులు కూడా విచ్చేసి తమ కళలను ప్రదర్శిస్తారు.

సాంకేతిక ఉత్సవాలు

ప్రతీ ఐఐటీలో ప్రతీ ఏడాదీ సాధారణంగా మూడు రోజుల నుంచి నాలుగు రోజుల పాటు సాంకేతిక ఉత్సవాలు (Technical Festivals) జరుపుకుంటారు. ఐఐటీ రూర్కీలో కోగ్నిజన్స్ (Cognizance), ఐఐటీ మద్రాసులో శాస్త్ర (Shaastra), ఐఐటీ కాన్పూర్ లో టెక్‌కృతి (Techkriti), ఐఐటీ ఖరగ్పూర్ లో క్షితిజ్ (Kshitij), ఐఐటీ బాంబే లో టెక్‌ఫెస్ట్ (Techfest), ఐఐటీ ఢిల్లీ లో ట్రిస్ట్ (Tryst), ఐఐటీ గౌహతిలో టెక్నిక్ (Techniche) అనే పేర్లతో నిర్వహించబడతాయి. వీటిలో చాలావరకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించబడతాయి. ట్రిస్ట్ ఉత్సవానికి ఎక్కువ మంది హాజరవడమే కాకుండా ఇక్కడ అనేక విధాలైన కార్యక్రమాలు కూడా చూపరులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఐఐటీ మద్రాసులో కేవలం విద్యార్థులచే నిర్వహించబడే శాస్త్ర ప్రపంచ నాణ్యతా పరమైన ప్రమాణాలు పాటిస్తూ ISO 9001:2000 సర్టిఫికేట్ ను సంపాదించింది.[22]

సాంస్కృతిక సంభరాలు

కేవలం సాంకేతిక ఉత్సవాలే కాక ఐఐటీలలో సాంస్కృతిక ఉత్సవాలు కూడా మూడు నాలుగు రోజుల పాటు జరుపుతారు. ఐఐటీ రూర్కీ లో థామ్సో (Thomso), ఐఐటీ మద్రాసులో సారంగ్ (Saarang), ఐఐటీ కాన్పూరు లో అంతరాజ్ఞి (Antaragni), ఐఐటీ ఖరగ్‌పూర్ లో స్ప్రింగ్ ఫెస్టివల్ (Spring Fest), ఐఐటీ బాంబే లో మూడ్ ఇండిగో (Mood Indigo ), ఐఐటీ ఢిల్లీ లో రెండెజ్వస్ (Rendezvous), ఐఐటీ గౌహతిలో ఆల్కెరింగా (Alcheringa) అనే పేర్లతో నిర్వహించబడతాయి.
ఐఐటీ ఖరగ్పూర్ లో ప్రమిదలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన
ఇవి కాకుండా ఐఐటీ ఖరగ్‌పూర్ మరియు ఐఐటీ బాంబే ప్రత్యేకంగా ఉత్సవాలు జరుపుతాయి. ఐఐటీ ఖరగ్‌పూర్ దీపావళి రోజున ఇల్యూమినేషన్ ఫెస్టివల్ మరియు రంగోలి ఫెస్టివల్ జరుపుతారు. ఈ ఉత్సవంలో ఎత్తుగా నిర్మించిన వెదురు కట్టడాల మీద మట్టితో చేసిన ప్రమిదలతో మనుషుల రూపాలు, కట్టడాల రూపాలు మొదలైన ఆకారాలు ఏర్పాటు చేస్తారు.[23] ఇవి ప్రధానంగా హాస్టళ్ళ మద్యనే జరిగినా బయటి వాళ్ళు కూడా పాల్గుంటుంటారు. ఇక రంగోలి ఉత్సవాలలో భాగంగా మెత్తటి పొడితో గానీ, పగిలి పోయిన గాజు ముక్కలతోగానీ ఏర్పాటు చేసిన కళారూపాలను ప్రదర్శిస్తారు.
ఐఐటీ బాంబే ప్రత్యేకంగా నిర్వహించేది పర్ఫామింగ్ ఆర్ట్స్ ఫెస్టివల్ (Performing Arts Festival). దీనిలో నాటకాలు, సాహిత్య ప్రక్రియలు, వక్తృత్వపు పోటీలు, నృత్య పోటీలు, చిత్ర లేఖనం, సంగీతం మొదలైనవి నిర్వహించబడతాయి. ఇవన్నీ ఐఐటీ బాంబే లోగల ఓపెన్ ఎయిర్ థియేటర్ నందు ప్రదర్శించబడతాయి.

గుర్తింపు

ఐఐటీలు ఇచ్చే డిగ్రీలు AICTE గుర్తింపు కలిగి ఉండటం వలన వీటికి దేశంలో ఎక్కడైనా గుర్తింపు ఉంటుంది. పూర్వ విద్యార్థులు విదేశాలలో తమ సత్తా చాటడం వలన అక్కడ కూడా వీటికి చాలా గుర్తింపు ఉంది. భారత ప్రభుత్వం IIT చట్టం ద్వారా వీటికి ప్రత్యేక గుర్తింపునివ్వడం ఐఐటీల విజయంలో కీలకమైన అంశం.

విమర్శ

ఎన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నా ఐఐటీలు విమర్శలకూ లోనయ్యాయి. ఐఐటీలపై ప్రధాన విమర్శ మేధో వలస( Brain Drain). ఇంకా కొద్దిమంది విమర్శకులు స్త్రీ శాతం తక్కువగా ఉండటం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారిని పట్టించుకోకపోవడం వంటి అంశాలను లేవనెత్తుతుంటారు.

పూర్వ విద్యార్థులు

ఐఐటీలలో చదివిన పూర్వ విద్యార్థులు తాము చదివిన విద్యాసంస్థల పట్ల గౌరవాన్ని చాటుకోవడం కోసం వివిధ రకాలైన కార్యక్రమాలను చేపడుతుంటారు. స్వదేశం లోనూ మరియు విదేశాలలోనూ ఎన్నో పూర్వ విద్యార్థుల సంఘాలు ఈ సంస్థల అభివృద్ధికి ఇతోధికంగా సహాయ పడుతున్నాయి. పూర్వ విద్యార్థులు కొందరు ప్రస్తుత ఐఐటి విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా, మరియు ధన సహాయం చేయడం ద్వారా తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

ప్రముఖ ఐఐటియన్లు

ఐ.ఐ.టీ. 2012 ఫలితాలు

  • ఐ.ఐ.టీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జె.ఇ.ఇ.) ఫలితాలు 18 మే 2012 న విడుదల చేసారు. దేశవ్యాప్తంగా 5 లక్షలమంది ఈ పరీక్ష రాసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 55 వేలమంది విద్యార్ధులు ఈ పరీక్ష రాసారు. ఐ.ఐ.టీ, ఢిల్లీ, ఈ పరీక్షను జరిపింది. 6 మే 2012 నాడు మార్కులను ప్రకటించింది. 18 మే 2012 నాడు స్థానాలను (ర్యాంకులు) ప్రకటించారు. ఈ ర్యాంకుల వివరాలను, ఐ.ఐ.టీ వెబ్ సైట్లలో విద్యార్ధుల కు తెలియటానికి ఉంచారు. ఈ విద్యార్ధులు, 15 ఐ.ఐ.టీలు, రెండు ఐ.ఐ.టీకి సంబంధించిన విద్యాసంస్థలలో వీరు ప్రవేశం పొందుతారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు 4, 5, 7, 9 స్థానాలు పొందారు. ప్రధమస్థానం (385/408 మార్కులు) అర్పిత్ అగర్వాల్ (ఢిల్లీ), రెండవ స్థానం విజయ్ కొచ్చర్ (చండీగడ్ ), మూడవ స్థానం నిషాంత్ కౌషిక్ (భిలాయ్ )